Political News

‘జ‌న‌సైన్యం’ తెలుసుకోవాల్సిన నిజం ఇదే!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క ల‌క్ష్యం పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కిం చుకుని అధికారంలోకి రావాల‌ని ఆయ‌న నిర్ణ‌యానికి వ‌చ్చారు. పొత్తులు ఉంటాయా.. ఉండ‌వా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడి తే.. ఏ రాజ‌కీయ పార్టీకైనా ఉండాల్సిన ల‌క్ష్యం అధికార‌మే కాబ‌ట్టి.. ఆయ‌న పెట్టుకున్న ల‌క్ష్యాన్ని త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఈ ల‌క్ష్య సాధ‌న‌కు క‌లిసి వ‌చ్చేవారేరీ? అనేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన వారెవ‌రూ.. ఇప్పుడు క‌నీసం క‌నిపించ‌డం లేదు. సో.. ఉన్న‌దంతా అభిమాన గ‌ణ‌మే!

ప‌వ‌న్ ఎక్క‌డ స‌భ పెట్టినా.. ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. అభిమానులు పోటెత్తుతున్నారు. భారీ ఎత్తున ఈల‌లు వేస్తూ.. గోల గోల చేస్తున్నారు. ప‌వ‌న్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. స‌భ‌లు కిక్కిరిసిపోతున్నాయి. ‘కాబోయే సీఎం ప‌వ‌న్‌’ అనే నినాదాలు కూడా మిన్నంటుతున్నాయి. అయితే.. ఇప్పుడు కావాల్సింది ఇంతేనా? ఇలా.. అరిచి గోల చేసి.. అభిమానం చాటుకుంటే స‌రిపోతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. గ‌తంలో ఎన్టీఆర్‌కు కూడా గ్రామ గ్రామ అభిమానులు పోటెత్తారు. బ‌ళ్లు క‌ట్టుకుని వ‌చ్చి.. ఆయ‌న ప్ర‌సంగాలు విన్నారు. ఆయ‌న స‌భ‌ల‌ను విజ‌య‌వంతం చేశారు.

అయితే.. ఆ అభిమానాన్ని వారు అక్క‌డితో వ‌దిలేయ‌లేదు. త‌మ ఓటు రూపంలో సైకిల్‌పై గుద్దేశారు. ఫ‌లితంగా పార్టీ పెట్టిన మూణ్నాళ్ల‌కే అన్న‌గారు అధికారం అందుకున్నారు. ఇప్పుడు ఆ స్పృహ ప‌వ‌ర్ స్టార్ అభిమానుల్లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. క‌నిపించి ఉంటే.. ప‌వ‌న్ నిజంగానే ఈ పాటికి సీఎం అయి ఉండేవార‌నేది వాస్త‌వం. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ అభిమానులు పోటెత్తారు. కానీ, ఆ అభిమానాన్ని వారు ఓటు రూపంలో కురిపించ‌లేక పోయార‌నేది నిష్టుర స‌త్యం. ఇక‌, ఇప్పుడైనా.. ఆ దిశ‌గా ప‌వ‌న్ అభిమానులు ముందుకు క‌ద‌లాల‌నేది జ‌న‌సేన అభిమానుల మాట‌.

ప్ర‌త్య‌క్షంగా అభిమానులు త‌మ ఓటును వేయ‌డంతోపాటు.. ప‌రోక్షంగా.. ప‌వ‌న్ నినాదాల‌ను, ఆయ‌న ఆశ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని కూడా వారు సూచిస్తున్నారు. ప‌వ‌న్ వ‌చ్చిన‌ప్పుడు పండ‌గ‌.. ఆయ‌న లేక పోతే.. దండ‌గ అన్న‌ట్టుగా ఉన్న పార్టీని చేత‌నం చేసేందుకు.. చొర‌వ‌చూపాల్సిన‌.. అభిమానం చాటుకోవా్ల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న‌ది అభిమానుల మాట‌. ఒక్కొక్క ప‌వ‌న్ అభిమాని.. ప‌ది ఇళ్ల‌ను ద‌త్త‌త తీసుకుని.. వ‌చ్చే రెండేళ్ల‌లో.. జిల్లాలు.. మండ‌లాలు.. న‌గ‌రాలు.. గ్రామాల్లో ప‌ర్య‌టించి.. ప‌వ‌న్ కోసం.. కృషి చేస్తే.. ఫ‌లితం క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంద‌ని ప‌రిశీల‌కులు సైతం చెబుతున్నారు. కానీ, ఆ దిశ‌గా క‌దిలేది ఎవ‌రు? అనేదే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Satya

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

13 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

43 minutes ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

1 hour ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

4 hours ago