నిజంగానే ఇది ఇప్పటి వరకు దేశంలో చాలా మంది తెలియని అతి పెద్ద రహస్యం. ముఖ్యమంత్రులు, ప్రధానులు.. ఏం తినాలో.. ఎటు వైపు వెళ్లాలో.. ఎక్కడ పర్యటించాలో.. వంటివాటిని మాత్రమే అదికారులు నిర్ణయిస్తారని.. ముందుగా.. కొన్ని పదార్థాలపై టెస్టులు కూడా చేస్తారని తెలుసు. కానీ.. రాష్ట్రపతి విషయంలో వీటికి అదనంగా కూడా కొన్ని నిర్ణయాలు అధికారులే తీసుకుంటారనే విషయం.. ఇప్పుడే వెలుగు చూసింది. రాష్ట్రపతి ఏం మాట్లాడాలో.. ముందుగానే రాష్ట్రపతి భవన్ చీఫ్ సెక్రటరీ నిర్ణయం చేస్తారట.
అంతేకాదు.. రాష్ట్రపతి నుంచి కొన్ని బ్రీఫింగ్స్ తీసుకుని.. వాటిని ప్రసంగం రూపంలో మలుస్తారు. సరే.. ఇంత వరకు ఓకే. ఇక, రాష్ట్రపతి ఏం తినాలో.. ఏం తాగాలో కూడా రాష్ట్రపతి భవన్ అధికారులే నిర్ణయిస్తారు. ఈ విషయాన్ని గతంలో రాష్ట్రపతిగా చేసిన వారు కూడా బయట పెట్టారు. దీనికి అతీతంగా వ్యవహరించింది… ఒక్క కలాం మాత్రమే. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఎవరు ఏం పెట్టినా తినేవారు. నిబంధనలు అవసరం లేదు! అని మొహం మీదే చెప్పేవారు. అంతేకాదు.. ఆయన ఎక్కడికైనా పర్యటనలకు వెళ్తే.. తనకు నచ్చిన ప్రాంతానికి షెడ్యూల్లో లేకపోయినా వెళ్లేవారు.
కానీ, ఇప్పుడు వెలుగు చూసిన మరో సంచలన విషయం.. ప్రస్తుతం రాష్ట్రపతి గా ఎన్నికైన ద్రౌపది ముర్ము.. ఎలాంటి చీర కట్టుకోవాలో.. కూడా రాష్ట్రపతి భవన్ అధికారులే నిర్ణయిస్తారని తెలియడం. ఇదేమీ జోక్ కాదు. నిజమే. భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
ముర్ము ప్రమాణస్వీకారం కోసం సంప్రదాయ సంతాలీ చీరను కోసం ఆమె వదిన సుక్రీ టుడూ తీసుకెళ్లారు. శనివారమే తన భర్త తరినిసేన్ టుడూ(ముర్ము సోదరుడు)తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంటులో జరిగే కార్యక్రమానికి వీరు హాజరుకానున్నారు. అయితే.. సుక్రీ సంచలన విషయం బయట పెట్టారు. ‘దీదీ కోసం నేను సంతాలీ చీర తీసుకెళ్తున్నా. ప్రమాణస్వీకారానికి ఈ చీర ధరిస్తుందని ఆశిస్తున్నా. నిజానికి ఆమె ఈ చీరే ధరిస్తారో లేదో తెలియదు. ఆమె కట్టుకునే చీరలపై రాష్ట్రపతి భవన్ అధికారులే నిర్ణయం తీసుకుంటారట’ అని సుక్రీ పేర్కొన్నారు.
This post was last modified on July 25, 2022 10:49 am
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…