Political News

జ‌గ‌న్‌కే అభిమానులం.. పార్టీ మార‌ను..

వైసీపీ నాయ‌కుడు.. సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. ఒంగోలు పార్ల‌మెంటు స‌భ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. మీడియా ముందుకు వ‌చ్చారు. రాష్ట్రంలో త‌న‌పైనా.. త‌న కుటుంబం పైనా జ‌రుగుతున్న రాజ‌కీయ ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. తాను, త‌న కుటుంబం.. త‌న సొద‌రులు కూడా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు అభిమానుల‌మేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ కుటుంబంపై వ‌స్తున్న వార్త‌ల‌ను ఇప్ప‌టికైనా క‌ట్టిపెట్టాల‌న్నారు.

గ‌త కొన్నాళ్లుగా.. మాగుంట వ్య‌వ‌హార శైలిపై.. అనేక మీడియాల్లో విస్తృతంగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో ఆయ‌న టీడీపీ ఎంపీల‌కు పార్టీలు ఇవ్వ‌డం.. వారితో క‌లిసి ఫొటోలు దిగ‌డం వంటివి చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ స‌మ‌యంలోనే ఒంగోలులో వైసీపీ నేత‌ల‌కు ఆయ‌న అందుబాటులో లేక‌పోవ‌డం.. మంత్రులు సురేష్‌, బాలినేని శ్రీనివాస‌రెడ్డిల‌తో కూడా ఆయ‌న‌కు పొస‌గ‌క పోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీ మారుతున్నార‌నే వాద‌న బ‌ల‌ప‌డింది.

అంతేకాదు.. క‌రోనా స‌మ‌యం లో ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేద‌ని.. చేసేది కూడా నామ‌మాత్రంగానే ఉంద‌ని విప‌క్షాల కంటే ఎక్కువ‌గానే ఆయ‌న విమ‌ర్శించారు. క‌రోనా మందు త‌యారు చేసిన ఆనంద‌య్య తో ప్ర‌త్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి త‌న సొంత ఖ‌ర్చుల‌తో మందును పంపిణీ చేయ‌డం.. కూడా వైసీపీ కి ఇబ్బందిగా ప‌రిణ‌మించింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీకి దూర‌మ‌వుతున్నార‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

అయితే.. ఈ వాద‌న ఒక‌వైపు బ‌ల‌ప‌డుతున్న క్ర‌మంలోనే.. తాజాగా మాగుంట మీడియా ముందుకు వ‌చ్చి.. సీఎం జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే తాను ప‌నిచేస్తాన‌ని.. తాను.. త‌న కుటుంబం వైసీపీని వీడ‌బోమ‌ని.. వేరే పార్టీలో చేరేది కూడా లేద‌ని చెప్పారు. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌ను జ‌గ‌న్ ఆహ్వానించార‌ని.. ఆయ‌న ఆహ్వానంతోనే వైసీపీలోకి వ‌చ్చాన‌ని చెప్పారు. తాము పార్టీని విడిచి పెట్టేది లేద‌న్నారు. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on July 25, 2022 6:59 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago