వైసీపీ నాయకుడు.. సీనియర్ పొలిటీషియన్.. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత.. మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో తనపైనా.. తన కుటుంబం పైనా జరుగుతున్న రాజకీయ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను, తన కుటుంబం.. తన సొదరులు కూడా.. వైసీపీ అధినేత, సీఎం జగన్కు అభిమానులమేనని ఆయన చెప్పుకొచ్చారు. తమ కుటుంబంపై వస్తున్న వార్తలను ఇప్పటికైనా కట్టిపెట్టాలన్నారు.
గత కొన్నాళ్లుగా.. మాగుంట వ్యవహార శైలిపై.. అనేక మీడియాల్లో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల సమయంలో ఆయన టీడీపీ ఎంపీలకు పార్టీలు ఇవ్వడం.. వారితో కలిసి ఫొటోలు దిగడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. ఈ సమయంలోనే ఒంగోలులో వైసీపీ నేతలకు ఆయన అందుబాటులో లేకపోవడం.. మంత్రులు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో కూడా ఆయనకు పొసగక పోవడం వంటి పరిణామాల నేపథ్యంలోనే ఆయన పార్టీ మారుతున్నారనే వాదన బలపడింది.
అంతేకాదు.. కరోనా సమయం లో ప్రభుత్వం ఏమీ చేయడం లేదని.. చేసేది కూడా నామమాత్రంగానే ఉందని విపక్షాల కంటే ఎక్కువగానే ఆయన విమర్శించారు. కరోనా మందు తయారు చేసిన ఆనందయ్య తో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి తన సొంత ఖర్చులతో మందును పంపిణీ చేయడం.. కూడా వైసీపీ కి ఇబ్బందిగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి దూరమవుతున్నారనే చర్చ తెరమీదికి వచ్చింది.
అయితే.. ఈ వాదన ఒకవైపు బలపడుతున్న క్రమంలోనే.. తాజాగా మాగుంట మీడియా ముందుకు వచ్చి.. సీఎం జగన్ కనుసన్నల్లోనే తాను పనిచేస్తానని.. తాను.. తన కుటుంబం వైసీపీని వీడబోమని.. వేరే పార్టీలో చేరేది కూడా లేదని చెప్పారు. గత 2019 ఎన్నికల సమయంలో తనను జగన్ ఆహ్వానించారని.. ఆయన ఆహ్వానంతోనే వైసీపీలోకి వచ్చానని చెప్పారు. తాము పార్టీని విడిచి పెట్టేది లేదన్నారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on July 25, 2022 6:59 am
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం జరిగిన ఓ వివాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.…
భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన…
రీ రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి వింటేజ్ సినిమాలను థియేటర్ లో అనుభూతి చెందాలనే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. నిన్న…
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,మాపో…
నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’తో తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు. గత వారం విడుదలైన ఈ చిత్రం..…
మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న…