Political News

జగన్ కీలక నిర్ణయం !

గడపగడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహణపై జగన్మోహన్ రెడ్డి జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్లతో సమీక్షించారు. కార్యక్రమం జరుగుతున్న తీరుతెన్నులపై అందరితో మాట్లాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో వాళ్ళకున్న బాధ్యతలు ఏమిటి ? వాళ్ళపై తాను ఎలాంటి భారాన్ని మోపారనే విషయాన్ని జగన్ వివరించారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయటంలో జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్ల పాత్రపై జగన్ స్పష్టత ఇచ్చారు.

పనిలోపనిగా ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. అదేమిటంటే ఆగష్టు 4వ తేదీనుండి ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో తాను సమావేశం అవబోతున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలను ఎంపికచేసి క్షేత్రస్ధాయిలో పార్టీ, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఏమిటో తెలుసుకుంటానని చెప్పారు. అలాగే పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి పరిష్కారాలను, ఎంఎల్ఏల పనితీరు తదితరాల ఫీడ్ బ్యాంక్ కోసమే డైరెక్టుగా కార్యకర్తలతో సామవేశం అవుతున్నట్లు చెప్పారు.

ఆగష్టు నుండి మొదలయ్యే కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను తొందరలోనే ఒక ప్రకటన చేయబోతున్నట్లు కూడా చెప్పారు. కార్యకర్తలతో జగన్ సమావేశం అవటం లేదనే ఆరోపణలు, అసంతృప్తి చాలామందిలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజాప్రతినిధులు, నేతల, కార్యకర్తలను కలిసినట్లుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవటం సాధ్యం కాదన్నది వాస్తవం. అయితే నేతలు, కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తే జరిగే పరిణామాలు ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

ఏ పార్టీకి అయినా కార్యకర్తలే ఆయువుపట్టు. పార్టీ జెండాలు మోసేది, బ్యానర్లు కట్టేది అవసరమైతే ప్రత్యర్ధి పార్టీలతో కలబడేది కూడా కార్యకర్తలే. కొంపాగోడు అంతా వదిలిపెట్టి పార్టీకోసం పనిచేసేది వాళ్ళే కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను సీఎం గుర్తించాలని వాళ్ళు అనుకోవటంలో తప్పే లేదు. కాకపోతే అందరినీ కలవటం ఏ ముఖ్యమంత్రికీ సాధ్యం కాదు. అయితే వీలైనంతలో ఏదో పద్దతిలో ఎంతమందిని వీలైతే అంతమందిని సాటిస్ఫై చేస్తే అసంతృప్తి కొంతలో కొంతైనా తగ్గుతుంది. ఇందుకనే వచ్చే నెల నుండి ముఖాముఖి కార్యక్రమాలు పెట్టుకున్నది.

This post was last modified on July 23, 2022 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

5 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

11 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

14 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

16 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

17 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

17 hours ago