Political News

కేసీయార్ ను అవమానించిన మోడీ సర్కార్

నరేంద్రమోడీ ప్రభుత్వం కేసీయార్ తో పాటు మరికొందరు ముఖ్యమంత్రులను ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించింది. పదవీ విరమణ చేయబోతున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నరేంద్ర మోడీ వీడ్కోలు విందిచ్చారు. ఈ విందుకు తనకు ఇష్టమైన ముఖ్యమంత్రులను మాత్రమే పిలిచి ఇష్టంలేని ముఖ్యమంత్రులను వదిలేశారు. నిజానికి రాష్ట్రపతి గౌరవార్థం విందు ఇస్తున్నపుడు ఎవరిని పిలవాలనే విషయంలో స్పష్టమైన ప్రోటోకాల్ ఉంటుంది.

ప్రోటోకాల్ ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ మోడీ సర్కార్ దాన్ని తుంగలో తొక్కటమే విచిత్రంగా ఉంది. తనకిష్టం ఉన్నా లేకపోయినా మోడీ కొందరిని పిలిచి తీరాల్సిందే. ఎందుకంటే మోడీ ఇచ్చిన విందు వ్యక్తిగతం కాదు. రామ్ నాథ్ వచ్చిందీ వ్యక్తిగత హోదాలో కాదు. ప్రధానమంత్రి హోదాలో మోడీ ఇచ్చిన విందుకు రాష్ట్రపతి హోదాలో కోవిండ్ హాజరయ్యారు. కాబట్టి ఇష్టమున్నా లేకపోయినా అందరు ముఖ్యమంత్రులను పిలిచి తీరాల్సిందే.

విందుకు 21 మంది ముఖ్యమంత్రులను పిలిచిన ప్రధానమంత్రి కార్యాలయం కేసీయార్ తో పాటు కేరళ, ఛత్తీస్ ఘడ్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మిజోరం, ఝార్ఖండ్ సీఎంలను పిలవలేదు. విచిత్రమేమిటంటే అందరినీ వ్యక్తిగతంగా పిలిచేంత సమయంలేదు కాబట్టి ఢిల్లీలోని వివిధ రాష్ట్ర భవన్ల రెసిడెంట్ కమీషనర్లకు ఇన్విటేషన్ కార్డులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నది ప్రధాని కార్యాలయం. అందరినీ ప్రధానమంత్రే స్వయంగా పిలవాల్సిన అవసరం లేదు. పీఎంవోలోని కీలక వ్యక్తికి అప్పగిస్తే సదరు ఉన్నతాధికారే ముఖ్యమంత్రులకు ఫోన్లో ఆహ్వానిస్తారు. కానీ ఆ పని కూడా పీఎంవో చేయలేదు.

యూపీఏ కూటమిలోని సీఎంలకు, యశ్వంత్ కు మద్దతిచ్చిన సీఎంలను మోడీ పిలవలేదు. మళ్ళీ తమిళనాడు సీఎం స్టాలిన్ను మాత్రం పిలిచారు. చివరినిముషంలో విందు ఇవ్వాలని నిర్ణయమైంది కాబట్టి సీఎంలను పిలవలేకపోతున్నట్లు చెప్పటం కూడా అబద్ధం చెప్పి కొందరు సీఎంలను ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించినట్లు అర్ధమైపోతోంది. పిలిచిన వారిలో జగన్, నవీన్ పట్నాయక్ హాజరుకాకపోవటం గమనార్హం.

This post was last modified on July 23, 2022 10:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

41 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago