నరేంద్రమోడీ ప్రభుత్వం కేసీయార్ తో పాటు మరికొందరు ముఖ్యమంత్రులను ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించింది. పదవీ విరమణ చేయబోతున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నరేంద్ర మోడీ వీడ్కోలు విందిచ్చారు. ఈ విందుకు తనకు ఇష్టమైన ముఖ్యమంత్రులను మాత్రమే పిలిచి ఇష్టంలేని ముఖ్యమంత్రులను వదిలేశారు. నిజానికి రాష్ట్రపతి గౌరవార్థం విందు ఇస్తున్నపుడు ఎవరిని పిలవాలనే విషయంలో స్పష్టమైన ప్రోటోకాల్ ఉంటుంది.
ప్రోటోకాల్ ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ మోడీ సర్కార్ దాన్ని తుంగలో తొక్కటమే విచిత్రంగా ఉంది. తనకిష్టం ఉన్నా లేకపోయినా మోడీ కొందరిని పిలిచి తీరాల్సిందే. ఎందుకంటే మోడీ ఇచ్చిన విందు వ్యక్తిగతం కాదు. రామ్ నాథ్ వచ్చిందీ వ్యక్తిగత హోదాలో కాదు. ప్రధానమంత్రి హోదాలో మోడీ ఇచ్చిన విందుకు రాష్ట్రపతి హోదాలో కోవిండ్ హాజరయ్యారు. కాబట్టి ఇష్టమున్నా లేకపోయినా అందరు ముఖ్యమంత్రులను పిలిచి తీరాల్సిందే.
విందుకు 21 మంది ముఖ్యమంత్రులను పిలిచిన ప్రధానమంత్రి కార్యాలయం కేసీయార్ తో పాటు కేరళ, ఛత్తీస్ ఘడ్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మిజోరం, ఝార్ఖండ్ సీఎంలను పిలవలేదు. విచిత్రమేమిటంటే అందరినీ వ్యక్తిగతంగా పిలిచేంత సమయంలేదు కాబట్టి ఢిల్లీలోని వివిధ రాష్ట్ర భవన్ల రెసిడెంట్ కమీషనర్లకు ఇన్విటేషన్ కార్డులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నది ప్రధాని కార్యాలయం. అందరినీ ప్రధానమంత్రే స్వయంగా పిలవాల్సిన అవసరం లేదు. పీఎంవోలోని కీలక వ్యక్తికి అప్పగిస్తే సదరు ఉన్నతాధికారే ముఖ్యమంత్రులకు ఫోన్లో ఆహ్వానిస్తారు. కానీ ఆ పని కూడా పీఎంవో చేయలేదు.
యూపీఏ కూటమిలోని సీఎంలకు, యశ్వంత్ కు మద్దతిచ్చిన సీఎంలను మోడీ పిలవలేదు. మళ్ళీ తమిళనాడు సీఎం స్టాలిన్ను మాత్రం పిలిచారు. చివరినిముషంలో విందు ఇవ్వాలని నిర్ణయమైంది కాబట్టి సీఎంలను పిలవలేకపోతున్నట్లు చెప్పటం కూడా అబద్ధం చెప్పి కొందరు సీఎంలను ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించినట్లు అర్ధమైపోతోంది. పిలిచిన వారిలో జగన్, నవీన్ పట్నాయక్ హాజరుకాకపోవటం గమనార్హం.
This post was last modified on July 23, 2022 10:36 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…