విజయవాడ ఎంపీ కేశినేని నాని మాటలు, పోస్టులు తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2024 ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చీల్చేస్తారంటు ఎంపీ మీడియాతో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకవైపు పార్టీలో ఎంపీ వ్యాఖ్యలపై చర్చలు జరుగుతుండగానే తాజాగా తన ఫెస్ బుక్ వాల్ పై మరో పోస్టు పెట్టారు. ‘యధార్ధవాది లోకవిరోధి’ అని తన పోస్టును ప్రారంభించారు.
తాను బీజేపీలోకి వెళతానని కొద్దిరోజులు, కాదు కాదు వైసీపీలోకి మారబోతున్నట్లు మరికొన్ని రోజులు తమ పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. పార్టీ హితవు కోరి, బలోపేతం అవటానికి తాను చంద్రబాబునాయుడుకు సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. తానిచ్చే సూచనలు వినటానికి కాస్త కటువుగా ఉన్నా అవి వాస్తవాలే అన్నారు. అయితే అధినేతను కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తు పార్టీలో తమ పబ్బం గడుపుకుంటున్నట్లు మండిపడ్డారు.
తనవల్ల పార్టీకి మంచి జరిగితే చంద్రబాబు కోటరీగా ఏర్పడ్డ నేతల వల్ల పార్టీకి చెడు జరుగుతోందన్నారు. వ్యక్తిగతంగా తనపై బురద చల్లటం మానేసి తాను చెప్పిన అంశాలను మాత్రమే ఆలోచించాలన్నారు. పార్టీని పటిష్టం చేయటంపై ఆలోచించి అధినేతకు సూచనలు చేయాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ఎలాగ అనే విషయాన్ని చర్చించటం మానేసి తనపై బురద చల్లటం వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని సూటిగా చెప్పారు.
ఏదేమైనా కేశినేని చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. స్వపక్షంలోనే ప్రతిపక్షంగా ఎంపీ తయారయ్యారని ఎంపీని ఉద్దేశించి విజయవాడలోని కొందరు నేతలు మండిపోతున్నారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా లాంటి నేతలతో ఎంపీకి చాలాకాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిని సర్దుబాటు చేయలేక చంద్రబాబునాయుడు కూడా చేతులెత్తేశారు. దాంతో ఈ నేతలంతా ఎవరిగోల వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
This post was last modified on July 22, 2022 10:27 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…