Political News

ఏందీ రచ్చ నాని గారు?

విజయవాడ ఎంపీ కేశినేని నాని మాటలు, పోస్టులు తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2024 ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చీల్చేస్తారంటు ఎంపీ మీడియాతో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకవైపు పార్టీలో ఎంపీ వ్యాఖ్యలపై చర్చలు జరుగుతుండగానే తాజాగా తన ఫెస్ బుక్ వాల్ పై మరో పోస్టు పెట్టారు. ‘యధార్ధవాది లోకవిరోధి’ అని తన పోస్టును ప్రారంభించారు.

తాను బీజేపీలోకి వెళతానని కొద్దిరోజులు, కాదు కాదు వైసీపీలోకి మారబోతున్నట్లు మరికొన్ని రోజులు తమ పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. పార్టీ హితవు కోరి, బలోపేతం అవటానికి తాను చంద్రబాబునాయుడుకు సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. తానిచ్చే సూచనలు వినటానికి కాస్త కటువుగా ఉన్నా అవి వాస్తవాలే అన్నారు. అయితే అధినేతను కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తు పార్టీలో తమ పబ్బం గడుపుకుంటున్నట్లు మండిపడ్డారు.

తనవల్ల పార్టీకి మంచి జరిగితే చంద్రబాబు కోటరీగా ఏర్పడ్డ నేతల వల్ల పార్టీకి చెడు జరుగుతోందన్నారు. వ్యక్తిగతంగా తనపై బురద చల్లటం మానేసి తాను చెప్పిన అంశాలను మాత్రమే ఆలోచించాలన్నారు. పార్టీని పటిష్టం చేయటంపై ఆలోచించి అధినేతకు సూచనలు చేయాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ఎలాగ అనే విషయాన్ని చర్చించటం మానేసి తనపై బురద చల్లటం వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని సూటిగా చెప్పారు.

ఏదేమైనా కేశినేని చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. స్వపక్షంలోనే ప్రతిపక్షంగా ఎంపీ తయారయ్యారని ఎంపీని ఉద్దేశించి విజయవాడలోని కొందరు నేతలు మండిపోతున్నారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా లాంటి నేతలతో ఎంపీకి చాలాకాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిని సర్దుబాటు చేయలేక చంద్రబాబునాయుడు కూడా చేతులెత్తేశారు. దాంతో ఈ నేతలంతా ఎవరిగోల వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

This post was last modified on July 22, 2022 10:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

21 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago