ఐటీడీపీ ప్రారంభించిన #APHopeCBN పేరిట హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్లో రెండో స్థానంలో నిలిచిం ది. వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. రాష్ట్రం.. చంద్రబాబు వైపు చూస్తోందంటూ ఐటీడీ పీ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. వరదల్లో చిక్కుకున్న వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందలేదని చాలా మంది బాధితులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరద ప్రభావిత కోనసీమ, అల్లూరు జిల్లాల్లో ప్రజలు ఇప్పటికీ.. ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అంతే కాదు.. బురద పేరుకుపోయి..రహదారులు కూడా పూడుకుపోయాయి. ఇక, ఇళ్ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పా ల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రజలను అన్ని రూపాల్లోనూ ఆదుకుంటుదని అందరూ అనుకుంటారు. అయితే.. మొక్కుబడి.. నామమాత్రపు.. సేవలతో ప్రభుత్వం బాధితుల కళ్లు గప్పే ప్రయత్నం చేసింది. ఇదే.. బాధిత కుటుంబాల ఆగ్రహానికి కారణమైంది.
ఈ నేపథ్యంలోనే బాధితులు ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్నారు. నిజానికి మహోగ్ర గోదావరి వరద కారణంగా.. వందల సంఖ్యలో గ్రామాలు.. లంక ప్రాంతాలు నీట మునిగాయి.అయితే.. అధికారులు మాత్రమే అంతో ఇంతో ప్రజల మద్యకు వచ్చారు. తప్ప.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు మాత్రం ఎక్కడా కనిపించలే దు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక ప్రభుత్వం పంచమని ఆదేశించిన కిలో టమాటాలు.. కిలో బంగాళ దుంపలు.. కిలో ఉల్లిపాయలు వంటివి కూడా కేవలం నాలుగేసి చొప్పున మాత్రమే ఇస్తున్నారనేది బాధితుల ఆవేదన.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి నాయకులను రంగంలోకి దింపి.. సాయం అందించేందుకు ప్రయత్నించారు. ఇది సక్సెస్ అయింది. దీంతో ఏపీ ప్రజలు చంద్రబాబుపై ఆశలు పెట్టుకున్నారనే అంశం తెరమీదికి వచ్చింది. దీనికి మెజారిటీ ప్రజలు లైకులు కొట్టడం, రీ ట్వీటులు చేయడం.. వంటివి రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఇదిలావుంటే, బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. మరి తాజాగా వెల్లడైన రిజల్ట్ ను బట్టి వైసీపీ సర్కారు ఎంతబాగా పనిచేస్తోందో అర్ధం అవుతోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 21, 2022 2:17 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…