Political News

ఏపీకి కేంద్ర మంత్రి వార్నింగ్

ఉచిత బియ్యం పంపిణీకి ధాన్యం సేకరణకు కేంద్ర మంత్రి లింకుపెట్టారు. పేదలకు ప్రధానమంత్రి పేరుతో పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని అందించకపోతే ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బియ్యం, వడ్లు సేకరణను వెంటనే నిలిపేస్తామంటు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయెల్ తీవ్రంగా హెచ్చరించారు. పీఎంజీకేఏవై 6వ దశలో ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని పీయూష్ గుర్తుచేశారు.

ప్రభుత్వ హామీ తర్వాత కేంద్రం ఏపీకి 8.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు కూడా మంత్రి తెలిపారు. ఈ పథకంలో బియ్యం పంపిణీ చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సుంటుందని పీయూష్ హెచ్చరించారు. ఈ పథకం కింద గడచిన ఐదు విడతల్లో 23,75,496 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించినట్లు కూడా ప్రకటించారు. తాము బియ్యం ఇవ్వటమే కానీ ఏపీ ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయటం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినపుడు తమ దగ్గరే కావాల్సినన్ని నిల్వలున్నాయని, కొన్ని నిర్దిష్టమైన సమస్యల కారణంగా పంపిణీ ఆలస్యమైందని మాత్రమే చెప్పినట్లు కేంద్రమంత్రి వివరించారు. తొందరలోనే పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చినట్లు కేంద్రమంత్రి గుర్తుచేశారు. ఏదేమైనా ఇంతకాలం తెలంగాణాలో మాత్రమే ఉన్న ధాన్యం సేకరణ వివాదం తొందరలో ఏపీకి కూడా పాకేట్లున్నది.

ధాన్యం సేకరణ విషయంలో చాలాకాలం తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రానికి మద్య పెద్ద వివాదమే నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకంగా కేసీయారే ధర్నాకు దిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దశలవారీగా మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలతో ఢిల్లీకి వెళ్ళి అక్కడే నిరసనలు తెలిపారు. దాంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అంతకాకపోయినా దాదాపు అలాంటి పరిస్ధితే ఏపీ విషయంలో కూడా తలెత్తుతుందా అనే డౌటు పెరిగిపోతోంది.

This post was last modified on July 21, 2022 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago