Political News

వైసీపీ అంకెలు… 5 ..40.. 60.. 151..175

ఏపీ అధికార పార్టీలో అంకెల కల్లోలం రేగింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలు పూర్ పెర్ఫార్మ‌ర్స్ అని తేలిపోయింది. వాళ్లు తిరిగిందీ లేదు.. తిరిగి సాధించిందీ లేదు అని తేలిపోయింది. నెల‌లో ఆయ‌న ఇర‌వై రోజులు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండ‌మంటే వీళ్లు ఆ మాట‌ను ఖాతరు చేసిన దాఖ‌లానే లేదు. ఆ విధంగా ఆ ఐదుగురిలో సీనియ‌ర్లు కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి లాంటి సీనియ‌ర్లే పెద్ద‌గా ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న వాద‌న వ‌స్తోంది. దీంతో ఆయ‌న అన‌గా జ‌గ‌న్ ఫుల్ సీరియ‌స్ అయ్యారు. పేర్లు చెప్ప‌కుండానే క్లాస్ ఇచ్చారు. నేను చేయాల్సింది నేను చేస్తున్నాను.. కానీ మీరు చేయాల్సింది మీరు చేయ‌కుండా ఉంటున్నారే! అని ప్ర‌శ్నించారాయ‌న. ఔట్ పుట్ బాలేద‌ని చెప్పేశారు.

మరో న‌ల‌భై మంది మ‌ళ్లీ పోటీ చేసినా గెలిచే సీన్ లేద‌ని తేలిపోయింది. అంటే సిట్టింగ్ ల‌కు నో ఛాన్స్.. ఇది కూడా చ‌ర్చ‌కు తావిస్తోంది.151 మందిలో 40 మంది పాల‌న‌పై, ప్ర‌జ‌ల‌పై ఎటువంటి ప్ర‌భావం చూప‌కుండా ఉన్నార‌ని కూడా తేలిపోయింది. ఇది కూడా సీఎం కోపానికి కార‌ణం అవుతోంది.

ఇక అర‌వై మంది ఎమ్మెల్యేల విష‌యానికి వ‌స్తే వీళ్లంతా పాఠ‌శాల‌ల విలీనాన్ని వ్య‌తిరేకిస్తూ సంబంధిత విద్యాశాఖ బాధ్య‌త‌లు చూస్తున్న అమాత్యులు బొత్స‌కు లేఖ‌లు రాసినవాళ్లు. వీళ్లంతా విలీనాన్ని పూర్తిగా నిర‌సిస్తూ ఉన్న‌వారు. విలీనం అన్న‌ది అనాలోచిత నిర్ణ‌యం అని తేల్చేశారు కూడా ! వాగులూ వంక‌లూ ఉన్న ప్రాంతాల్లో 200 పైగా స్కూళ్లు విలీనం కారణంగా మూత ప‌డితే వాళ్ల గ‌తేంటి .. ? హై రిస్క్ జోన్ల‌లో పాఠ‌శాల‌ల‌ను ఎలా మూస్తారు ? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే వైసీపీకి 60కి పైగా సీట్లు రావొచ్చు అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. లేదా 2014 నాటి రిజ‌ల్ట్ అంటే ఆ రోజు గెలుచుకున్న 67 సీట్లే మ‌ళ్లీ రానున్నాయి అన్న అభిప్రాయం కూడా ఉంది.

కానీ సీఎం మాత్రం 2019లో 151 సీట్ల‌ను గెలుచుకున్నాం.. ఈ సారి గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే 175 / 175 సాధించ‌లేమా అని ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే ఇవ‌న్నీ చెప్పేందుకు, వినేందుకు, రాసేందుకు బాగుంటాయి కానీ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి అన్న‌ది లేకుండా ఎవ్వ‌రం ఏం చేయ‌లేం అని అధికార పార్టీ స‌భ్యులు పెద‌వి విరుస్తున్నారు. ఇక వైసీపీలో ఏక్ నాథ్ షిండే త‌ర‌హాలో పెద్దిరెడ్డి చ‌క్రం తిప్పి పార్టీని చీలుస్తార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అదే క‌నుక జ‌రిగే అవ‌కాశం ఉంటే జ‌గ‌న్ కు మ‌రిన్ని కష్టాలు త‌ప్ప‌వ‌నే అభిప్రాయం రాజ‌కీయ ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తోంది.

This post was last modified on July 20, 2022 1:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

1 hour ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

3 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

4 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

5 hours ago