ఎప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా వెంటనే సెంటిమెంటు చిచ్చు మొదలవుతుంది. ఇపుడు భద్రాచలంపై మొదలైన వివాదం ఇందులో భాగమే. షెడ్యూల్ ఎన్నికలు మరో ఏడాదిన్నరలో వస్తున్నాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా రావచ్చు. అధికార టీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ముందస్తుకు రెడీగానే ఉన్నట్లున్నాయి. సో జనాలు కూడా ముందస్తు ఎన్నికలు ఖాయమనే అనుకుంటున్నారు.
రాజకీయ వేడి బాగా పెరిగిపోతోంది కాబట్టి హఠాత్తుగా సెంటిమెంటు కూడా మొదలైపోయింది. ఎన్నికలు అనగానే టీఆర్ఎస్ కు ముందుగా వచ్చేది తెలంగాణా జనాలను సెంటిమెంటు పేరుతో రెచ్చగొట్టడమే. ఇపుడు ప్రత్యేకంగా రెచ్చగొట్టడానికి అంశాలేమీలేవు. అందుకనే అందివచ్చిన భారీవర్షాలు, వరదలను టేకప్ చేసింది. ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముణిగిపోతుందని తెలంగాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంఎల్ఏలు గోల మొదలుపెట్టారు.
దీనికి అంతేస్ధాయిలో మంత్రులు బొత్సా సత్యనారాయణ, అంబటి రాంబాబుతో పాటు మాజీమంత్రి పేర్నినాని నుండి కౌంటర్లు మొదలయ్యాయి. వాతావరణం చూస్తుంటే ఇంకొద్ది రోజులు భద్రాచలం చుట్టూ వివాదం రగులుకునే అవకాశముంది. ఏపీకి ఇచ్చేసిన తెలంగాణాలోని ఏడు మండలాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చేయాలని పువ్వాడ, ఎంఎల్ఏలు రచ్చ మొదలుపెట్టేశారు. దాంతో భద్రాచలంను ఏపీకిచ్చేయాలని ఏపీ నుండి డిమాండ్లు మొదలయ్యాయి. నిజానికి భద్రాచలాన్ని ఏపీకి ఇచ్చేయటం సాధ్యం కాదని, ఏపీలోని ఏడు మండలాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చేయటం సాధ్యం కాదనీ తెలుసు.
రెండు వైపుల నుండి వస్తున్న డిమాండ్లలో ఏదీ సాధ్యంకాదని తెలిసి కావాలనే డిమాండ్లు మొదలుపెట్టారు. కాబట్టి ఇదే విషయమై తెలంగాణాలో పెద్ద రచ్చ జరుగుతుంది. జనాల్లో మళ్ళీ తెలంగాణా సెంటిమెంటును కావాలనే రగిల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనాలు కూడా రెచ్చిపోతే ఈ వేడి ఎన్నికలవరకు కంటిన్యు అవుతుందా ? లేకపోతే మళ్ళీ ఎన్నికల సమయానికి ఇంకో సెంటిమెంటును రగులుస్తారా ? చూడాలి.
This post was last modified on July 20, 2022 12:08 pm
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…