Political News

జోరు పెంచిన రేవంత్‌.. అధికార‌మే టార్గెట్‌

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గ‌తానికి భిన్నంగా పార్టీనిముందుకు న‌డిపించేందుకు ఆయ‌న వ్యూహ‌త్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ని బ‌లోపేతం చేయ‌డం.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం.. త‌ద్వారా.. పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఇవ్వ‌డం వంటి కీల‌క ప‌రిణామాల దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు.

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంటున్న వేళ… రేవంత్‌రెడ్డి జోరు పెంచ‌డంరాజ‌కీయగా చ‌ర్చ‌కు దారితీసింది. పార్టీ ప్రక్షాళన కోసం.. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. పీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, 36 మంది డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు.. జాబితా సిద్ధం చేసి అధిష్ఠానానికి నివేదించారు.

ఇప్పటికే ఉన్న ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా.. మార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి.. ఎన్నికలకు వెళ్లేట్లు రేవంత్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను చేపట్టి.. ఇతర పార్టీల నుంచి పార్టీలోకి చేరికలను రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. బలమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే జాబితాను అధిష్ఠానానికి అందజేసినట్లు సమాచారం. సీనియర్లను కట్టడి చేసుకుంటూ.. పార్టీలో దూకుడు పెంచిన రేవంత్‌రెడ్డి … అధికార టీఆర్ ఎస్‌, బీజేపీలను డిఫెన్స్‌లోప‌డేసేలా.. 90 లక్షలు ఓట్లు వస్తాయని.. 70 స్థానాల్లో గెలిచి తీరుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌కు 40లక్షలకుపైగా సభ్యత్వాలు ఉండడంతో ఒక్కో సభ్యుడు ఒక్క ఓటు వేసినా.. తాను అనుకున్న సీట్లు వస్తాయన్న ధీమాతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అదేస‌మ‌యంలో ఆయ‌న అధికార టీఆర్ ఎస్‌, బీజేపీలపై విమర్శలను తగ్గించి.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఏమి చేస్తుందో.. స్వయాన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో పీసీసీ ప్రకటించింది. ఇప్పటికే వరంగల్‌ సభలో రైతు డిక్లరేషన్‌ ప్రకటించడంతో… పార్టీలో జోష్‌ పెరిగి.. ఏకంగా మూడు శాతం ఓటింగ్‌ పార్టీకి పెరిగినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రైతు డిక్లరేషన్‌ను రైతురచ్చబండ పేరుతో.. జనంలోకి తీసుకెళ్లి పెద్దఎత్తున ప్రచారం కల్పించారు.

ఇప్పుడు తాజాగా.. సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న విద్యార్థి నిరుద్యోగ సభలో… నిరుద్యోగ యువత డిక్లరేషన్‌ ప్రకటించేందుకు పార్టీ కసరత్తు పూర్తి చేసింది. అయితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి.. వరదలు రావడంతో… వచ్చేనెల రెండో తేదీన సభ నిర్వహించడం సరికాదన్న ఆలోచనతో ఉన్న రేవంత్‌రెడ్డి… రాహుల్‌ గాంధీతో చర్చించి వాయిదా వేయించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా.. తాజాగా మారుతున్న ప‌రిణామాలు.. రేవంత్ దూకుడు వంటివి పార్టీ విజ‌యంపై ఆశ‌ల‌ను పెంచుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 19, 2022 6:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిపేర్లు సరే ముందు డ్యామేజ్ చూడండి

ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…

6 minutes ago

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

3 hours ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

4 hours ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

5 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

6 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

6 hours ago