Political News

కేవలం భారత్‌తోనే కాదు.. 18 దేశాలతో చైనాకు సరిహద్దు గొడవలు

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు ఇబ్బందికరంగా మారాయి. డ్రాగన్ దేశం తీరుపట్ల జపాన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ పక్షాన నిలబడ్డాయి. చైనా తీరుపై భారతీయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాలామంది చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మానేశారు.

ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్‌ను భద్రతాపరమైన చర్యలతో నిషేధించింది. తక్కువ కాలంలో ప్రపంచ అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా నిలిచిన చైనా కయ్యాలమారి. కేవలం భారత్‌తోనే కాదు ఆ సరిహద్దులు పంచుకున్న ఇతర దేశాలతో పాటు సరిహద్దులు లేని దేశాలతోను జగడం ఉండటం గమనార్హం.

18కి పైగా దేశాలతో చైనాకు సరిహద్దు వివాదం ఉండటం గమనార్హం. భారత్ నుండి జపాన్ నుండి పిలిప్సీన్ వరకు విస్తరణవాద భావజాలంతో అంతర్జాతీయంగా విమర్శలకు గురవుతోంది. అసలు చైనా భూభాగంపరంగా 14 దేశాలతోనే సరిహద్దులు కలిగి ఉంది. కానీ పద్దెనిమిది దేశాల కంటే ఎక్కువగా సరిహద్దు వివాదాలు కలిగి ఉంది.

దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని భూభాగాలపై జపాన్-చైనా మధ్య సరిహద్దు వివాదం ఉంది. ముఖ్యంగా సెంకాకు ఐస్‌లాండ్, ర్యుక్యూ ఐస్‌లాండ్‌ను రెండు దేశాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి.

వియత్నాంకు చెందిన పలు చారిత్రక ప్రదేశాలను కూడా చైనా క్లెయిమ్ చేసుకుంటోంది. మాకిల్స్‌ఫీల్డ్ బ్యాంక్, పారాసీల్ ఐస్‌లాండ్స్‌తో పాటు దక్షిణ చైనా సముద్రంలోని భాగాలు, స్ప్రాట్లీ ఐస్‌లాండ్స్‌‌ను ఇరు దేశాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి.

38,000 కిలో మీటర్ల అక్సాయ్ చినాయ్ భారత ప్రాంతాన్ని చైనా దశాబ్దాల క్రితం ఆక్రమించింది. అంతేకాదు లడక్, అరుణాచల్ ప్రదేశ్‌లపై కూడా కన్నేసింది. చైనా విస్తరణ భావజాలం ఇటీవల లడక్ ప్రాంతంలో బారత్-చైనా ఆర్మీ మధ్య ఘర్షణకు కారణమైంది.

నేపాల్ – చైనా మధ్య 1788-1792 మధ్య యుద్ధం జరిగింది. ఈ సమయంలోని తీసుకున్న నేపాల్ భూభాగాలను తమవిగా చైనా చెబుతోంది. చైనాకు మిత్రదేశంగా భావించే ఉత్తర కొరియాతోను బేక్డూ మౌంటెన్ విషయంలో సరిహద్దు గొడవలు ఉన్నాయి.

సౌత్ చైనా సముద్రంలోని కొన్ని భాగాలపై చైనా-పిలిప్పీన్స్ మధ్య గొడవలు ఉన్నాయి. ఈ విషయమై పిలిప్పీన్స్ అంతర్జాతీయ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ కేసును పిలిప్పీన్స్ గెలుచుకుంది. అయినప్పటికీ చైనా దీనికి కట్టుబడి లేకపోవడం గమనార్హం. అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను కూడా తుంగలో తొక్కింది.

రష్యాకు చెందిన 1,60,000 స్క్వేర్ కిలో మీటర్ల భూభాగాన్ని చైనా క్లెయిమ్ చేసుకుంటోంది. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. కానీ చైనా దీనిని ఏకపక్షంగా క్లెయిమ్ చేసుకుంటోంది.

సౌత్ చైనా సముద్రంలోని కొన్ని ప్రాంతాలపై సింగపూర్ – చైనా పోటీ పడుతున్నాయి.

ఈస్ట్ చైనాలో సౌత్ కొరియా ఉంటుంది. దీనిని తమ దిగా చెబుతోంది చైనా. భూటాన్ ప్రాంతాన్ని కూడా తనదిగా చెబుతుంది.

తైవాన్ మొత్తాన్ని తమదిగా చైనా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా మాకిల్స్‌ఫీల్డ్ బ్యాంక్, పారాసీల్ ఐస్‌లాండ్స్,తదితర ప్రాంతాలు తమవిగా చెబుతోంది.

లావోస్, బ్రూనై, తజకిస్తాన్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మంగోలియాలోని పలు ప్రాంతాలను తమవిగా చెబుతుంది.

This post was last modified on July 1, 2020 6:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: ChinaIndia

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago