మాజీ మంత్రి కొడాలి నాని అంటే చంద్రబాబునాయుడు అభిమానులకు ఎంతమంటుందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని ఇప్పటికి ఎన్నోసార్లు బహిరంగంగానే ప్రకటించారు. దానికి తగ్గట్లే టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే తమ మొట్టమొదటి టార్గెట్ మాజీమంత్రి కొడాలినానీయే అని స్పష్టంగా ప్రకటించారు.
టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీలో చాలామందే మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ తో పాటు ఎంతో మంది పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు చాలా మందే ఉన్నారు. ఇంతమందున్నా అందరినీ వదిలిపెట్టేసి తమ మొదటి టార్గెట్ కొడాలే అని చెప్పారంటేనే వాళ్ళల్లో మాజీమంత్రి పై ఎంతగా కసి పేరుకుపోయిందో అర్ధమవుతోంది. సరే చంద్రబాబు వార్నింగులిచ్చినా, అనిత చెప్పినా ఏమి చేయగలరన్నది అధికారంలోకి వచ్చిన తర్వాత మాట.
అనిత ఏమంటారంటే ఎవరి అకౌంట్లు వాళ్ళతోనే సెటిల్ చేసేస్తారట. ప్రత్యక్షంగా సెటిల్ చేయాల్సిన అకౌంట్లను ప్రత్యక్షంగానే సెటిల్ చేసేస్తారట. అలాగే కోర్టుల ద్వారా చేయాల్సినవి కోర్టుల ద్వారా చేస్తారట. తమను ఇంత ఇబ్బందులు పెడుతున్న వైసీపీ నేతల సంగతేంటో చూడకపోతే అధికారంలోకి వచ్చి ఉపయోగం ఏముంటుంది ? అని అడిగారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు మాసాల్లోనే అన్నీ అకౌంట్లను సెటిల్ చేసేయటమైతే ఖాయమట.
పార్టీ కోసం ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల చావులకు తాము సమాధానం చెప్పుకోవాలి కదాని అనిత అడిగటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక కొడాలి తర్వాత టార్గెట్ మాత్రం విజయసాయిరెడ్డేనట. చేసిన పాపాలకు విజయసాయి సమాధానం చెప్పుకోవాల్సిందే అని అనిత హెచ్చరించటమే విచిత్రంగా ఉంది. అంతా బాగానే ఉంది కానీ టీడీపీ టార్గెట్ లో జగన్మోహన్ రెడ్డి పేరును అనిత చెప్పపోవటమే ఆశ్చర్యంగా ఉంది. కొడాలి అయినా విజయసాయి అయినా జగన్ కోసమే కదా పనిచేస్తున్నది. మరి జగన్ పేరు చెప్పకుండా మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పటంలో ఆంతర్యం ఏమిటి ?
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…