మాజీ మంత్రి కొడాలి నాని అంటే చంద్రబాబునాయుడు అభిమానులకు ఎంతమంటుందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని ఇప్పటికి ఎన్నోసార్లు బహిరంగంగానే ప్రకటించారు. దానికి తగ్గట్లే టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే తమ మొట్టమొదటి టార్గెట్ మాజీమంత్రి కొడాలినానీయే అని స్పష్టంగా ప్రకటించారు.
టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీలో చాలామందే మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ తో పాటు ఎంతో మంది పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు చాలా మందే ఉన్నారు. ఇంతమందున్నా అందరినీ వదిలిపెట్టేసి తమ మొదటి టార్గెట్ కొడాలే అని చెప్పారంటేనే వాళ్ళల్లో మాజీమంత్రి పై ఎంతగా కసి పేరుకుపోయిందో అర్ధమవుతోంది. సరే చంద్రబాబు వార్నింగులిచ్చినా, అనిత చెప్పినా ఏమి చేయగలరన్నది అధికారంలోకి వచ్చిన తర్వాత మాట.
అనిత ఏమంటారంటే ఎవరి అకౌంట్లు వాళ్ళతోనే సెటిల్ చేసేస్తారట. ప్రత్యక్షంగా సెటిల్ చేయాల్సిన అకౌంట్లను ప్రత్యక్షంగానే సెటిల్ చేసేస్తారట. అలాగే కోర్టుల ద్వారా చేయాల్సినవి కోర్టుల ద్వారా చేస్తారట. తమను ఇంత ఇబ్బందులు పెడుతున్న వైసీపీ నేతల సంగతేంటో చూడకపోతే అధికారంలోకి వచ్చి ఉపయోగం ఏముంటుంది ? అని అడిగారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు మాసాల్లోనే అన్నీ అకౌంట్లను సెటిల్ చేసేయటమైతే ఖాయమట.
పార్టీ కోసం ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల చావులకు తాము సమాధానం చెప్పుకోవాలి కదాని అనిత అడిగటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక కొడాలి తర్వాత టార్గెట్ మాత్రం విజయసాయిరెడ్డేనట. చేసిన పాపాలకు విజయసాయి సమాధానం చెప్పుకోవాల్సిందే అని అనిత హెచ్చరించటమే విచిత్రంగా ఉంది. అంతా బాగానే ఉంది కానీ టీడీపీ టార్గెట్ లో జగన్మోహన్ రెడ్డి పేరును అనిత చెప్పపోవటమే ఆశ్చర్యంగా ఉంది. కొడాలి అయినా విజయసాయి అయినా జగన్ కోసమే కదా పనిచేస్తున్నది. మరి జగన్ పేరు చెప్పకుండా మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పటంలో ఆంతర్యం ఏమిటి ?
This post was last modified on July 18, 2022 9:02 pm
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…