Political News

శ‌ప‌థం ప‌క్క‌కు పెట్టి అసెంబ్లీకి వచ్చిన చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 8నెలల తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టారు. అయితే, ఆయ‌న వ‌చ్చిన స‌భా స‌మావేశాల‌కు కాదు.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటువేసే నిమిత్తం సోమవారం ఆయన అసెంబ్లీకి వ‌చ్చారు. వాస్త‌వానికి గత నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ‘ఈ ప్రభుత్వం గద్దె దిగేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోన’ని చంద్ర బాబు ప్రకటించారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న రాలేదు.

కానీ, సోమ‌వారం దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్ర‌బాబు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఆయ‌న అసెంబ్లీకి వ‌చ్చారు. అంతే త‌ప్ప త‌న శ‌ప‌థాన్ని ప‌క్క‌న పెట్టి మాత్రం కాదు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ఓటు వేశారు. ఈ రోజు ఉద‌యం అసెంబ్లీ ప్రాంగ‌ణానికి విచ్చేసిన ఆయ‌న ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన‌ పోలింగ్ బూత్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. పింక్ క‌ల‌ర్ బ్యాలెట్ ప‌త్రాన్ని తీసుకుని, ఆయ‌న త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఆయ‌న‌తోపాటు తెలుగు దేశం పార్టీ శాస‌న స‌భ్యులు కూడా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

కాగా, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గ‌నుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్ కే రోజా, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్, హోం శాఖా మంత్రి తానేటి వనితా తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంత‌రం, తదుపరి ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా ఓటు వేశారు.

This post was last modified on July 18, 2022 3:38 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

34 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

51 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

3 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

4 hours ago