Political News

శ‌ప‌థం ప‌క్క‌కు పెట్టి అసెంబ్లీకి వచ్చిన చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 8నెలల తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టారు. అయితే, ఆయ‌న వ‌చ్చిన స‌భా స‌మావేశాల‌కు కాదు.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటువేసే నిమిత్తం సోమవారం ఆయన అసెంబ్లీకి వ‌చ్చారు. వాస్త‌వానికి గత నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ‘ఈ ప్రభుత్వం గద్దె దిగేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోన’ని చంద్ర బాబు ప్రకటించారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న రాలేదు.

కానీ, సోమ‌వారం దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్ర‌బాబు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఆయ‌న అసెంబ్లీకి వ‌చ్చారు. అంతే త‌ప్ప త‌న శ‌ప‌థాన్ని ప‌క్క‌న పెట్టి మాత్రం కాదు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ఓటు వేశారు. ఈ రోజు ఉద‌యం అసెంబ్లీ ప్రాంగ‌ణానికి విచ్చేసిన ఆయ‌న ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన‌ పోలింగ్ బూత్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. పింక్ క‌ల‌ర్ బ్యాలెట్ ప‌త్రాన్ని తీసుకుని, ఆయ‌న త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఆయ‌న‌తోపాటు తెలుగు దేశం పార్టీ శాస‌న స‌భ్యులు కూడా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

కాగా, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గ‌నుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్ కే రోజా, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్, హోం శాఖా మంత్రి తానేటి వనితా తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంత‌రం, తదుపరి ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా ఓటు వేశారు.

This post was last modified on July 18, 2022 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

34 minutes ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

1 hour ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

1 hour ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

1 hour ago

ఉస్తాద్ సంబరాలకు సిద్ధమా?

రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్‌లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…

2 hours ago

ప్రసాదుగారు మళ్ళీ సిక్సు కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…

3 hours ago