Political News

శ‌ప‌థం ప‌క్క‌కు పెట్టి అసెంబ్లీకి వచ్చిన చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 8నెలల తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టారు. అయితే, ఆయ‌న వ‌చ్చిన స‌భా స‌మావేశాల‌కు కాదు.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటువేసే నిమిత్తం సోమవారం ఆయన అసెంబ్లీకి వ‌చ్చారు. వాస్త‌వానికి గత నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ‘ఈ ప్రభుత్వం గద్దె దిగేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోన’ని చంద్ర బాబు ప్రకటించారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న రాలేదు.

కానీ, సోమ‌వారం దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్ర‌బాబు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఆయ‌న అసెంబ్లీకి వ‌చ్చారు. అంతే త‌ప్ప త‌న శ‌ప‌థాన్ని ప‌క్క‌న పెట్టి మాత్రం కాదు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ఓటు వేశారు. ఈ రోజు ఉద‌యం అసెంబ్లీ ప్రాంగ‌ణానికి విచ్చేసిన ఆయ‌న ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన‌ పోలింగ్ బూత్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. పింక్ క‌ల‌ర్ బ్యాలెట్ ప‌త్రాన్ని తీసుకుని, ఆయ‌న త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఆయ‌న‌తోపాటు తెలుగు దేశం పార్టీ శాస‌న స‌భ్యులు కూడా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

కాగా, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గ‌నుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్ కే రోజా, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్, హోం శాఖా మంత్రి తానేటి వనితా తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంత‌రం, తదుపరి ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా ఓటు వేశారు.

This post was last modified on July 18, 2022 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది అయోమ‌యంపై ర‌విబాబు అస‌హ‌నం

ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్ర‌తి సినిమాకూ రిలీజ్ డేట్ మార‌డం అన్న‌ది మామూలైపోయింది. ఐతే…

2 hours ago

విజయ్ గురించి మన వాళ్లు కొట్టేసుకుంటున్నారు

ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల…

4 hours ago

94 వయసులో ‘సింగీతం’ మాయాజలం

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ కు పని చేసిన వ్యక్తి ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు…

5 hours ago

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్.. ఎవరెవరికి ఎంత ఛాన్స్?

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. దీంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక పాయింట్ల పట్టిక…

7 hours ago

‘చిట్టి’బాబుని ‘పెద్ది’గాడు కొట్టగలడా?

ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ…

8 hours ago

లండన్ కొలువులో కొడుకు… తల్లికి ఇందిరమ్మ ఇల్లు

సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం…

9 hours ago