ఔను.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్, సీతక్క.. అనుకున్నది ఒకటైతే.. చేసిందిమరొకటి. తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె తడబడ్డారు. ఆది నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కేంద్ర పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటేయాలని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయా రాష్ట్రాలకు తిరిగి మరీ.. సిన్హాకు ఎలా ఓటేయాలో కూడా నేర్పించారు.
ఎందుకంటే.. బీజేపీ అభ్యర్థికి పోటా పోటీగా నిలబెట్టిన సిన్హాకు కనీసం.. మెజారిటీ ఓటు బ్యాంకు రావడం ద్వారా.. ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయనే సంకేతాలు పంపించాలని .. కాంగ్రెస్ భావించింది. అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో సభ్యులకు ముందుగానే మాక్ పోలింగ్ కూడా నిర్వహించా రు. ఇక, తెలంగాణలోనూ శాసన సభ్యులకు పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే సిన్హానే మన నాయకుడు అని సూచించారు.
అంతా బాగానే జరిగింది. కానీ, తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో సీతక్క మాత్రం బీజేపీ అభ్యర్థి ముర్ముకు ఓటు గుద్దేశారు. ఆ తర్వాత.. తీరిగ్గా నాలుక కరుచుకున్నారు. అయ్యో.. నేను తప్పు చేశాను.. అని లబోదిబో మన్నారు. అంతేకాదు.. మరోసారి ఓటు వేస్తాను.. అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ.. అధికారులను ప్రాథేయ పడ్డారు. అయితే.. నిబంధనల ప్రకారం.. అలా కుదరదని.. అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన సీతక్క.. ఈ విషయం మీడియాకు చెప్పుకొని లబోదిబో మన్నారు.
This post was last modified on July 18, 2022 2:05 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…