ఔను.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్, సీతక్క.. అనుకున్నది ఒకటైతే.. చేసిందిమరొకటి. తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె తడబడ్డారు. ఆది నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కేంద్ర పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటేయాలని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయా రాష్ట్రాలకు తిరిగి మరీ.. సిన్హాకు ఎలా ఓటేయాలో కూడా నేర్పించారు.
ఎందుకంటే.. బీజేపీ అభ్యర్థికి పోటా పోటీగా నిలబెట్టిన సిన్హాకు కనీసం.. మెజారిటీ ఓటు బ్యాంకు రావడం ద్వారా.. ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయనే సంకేతాలు పంపించాలని .. కాంగ్రెస్ భావించింది. అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో సభ్యులకు ముందుగానే మాక్ పోలింగ్ కూడా నిర్వహించా రు. ఇక, తెలంగాణలోనూ శాసన సభ్యులకు పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే సిన్హానే మన నాయకుడు అని సూచించారు.
అంతా బాగానే జరిగింది. కానీ, తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో సీతక్క మాత్రం బీజేపీ అభ్యర్థి ముర్ముకు ఓటు గుద్దేశారు. ఆ తర్వాత.. తీరిగ్గా నాలుక కరుచుకున్నారు. అయ్యో.. నేను తప్పు చేశాను.. అని లబోదిబో మన్నారు. అంతేకాదు.. మరోసారి ఓటు వేస్తాను.. అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ.. అధికారులను ప్రాథేయ పడ్డారు. అయితే.. నిబంధనల ప్రకారం.. అలా కుదరదని.. అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన సీతక్క.. ఈ విషయం మీడియాకు చెప్పుకొని లబోదిబో మన్నారు.
This post was last modified on July 18, 2022 2:05 pm
కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…