వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరేయటం ఖాయమట. 2024 ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండపేటలో ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి తలా లక్ష రూపాయలు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జనసేన ధ్యేయమన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వంద తప్పులను భరిస్తాం, సహిస్తామని హెచ్చరించారు. తర్వాత ప్రభుత్వం తాటతీయటం ఖాయమన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ గనుక మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమైపోవటం ఖాయమని మండిపడ్డారు. సరే రాజకీయ ఉపన్యాసంగా పవన్ చాలా విషయాలు చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ వచ్చే ఎన్నికలకు జనసేన సిద్ధమని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. జనసేన ఏ విధంగా సిద్ధంగా ఉందని పవన్ చెప్పారో అర్ధం కావటం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులో పోటీ చేస్తుందా లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుందా అనే విషయంపైనే క్లారిటీ లేదు.
పార్టీకి అసలు గ్రామస్థాయి కమిటిలే లేవు. రేపటి ఎన్నికల్లో జనాలను పోలింగ్ కేంద్రాల దాకా తీసుకొచ్చి జనసేనకు ఓట్లేయించే యంత్రాంగమే పార్టీకి లేదు. పలానా నియోజకవర్గంలో పార్టీ తరపున పోటీ చేయబోయే గట్టి అభ్యర్ధి అని ఒక్కరు కూడా లేరు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగితే ఒక పద్దతిలో ఉంటుంది. అలాకాదని ఇప్పటికప్పుడు జరిగితే అభ్యర్ధుల ఎంపిక విషయంలో జనసేన చేతులెత్తేయాల్సిందే.
పార్టీ పెట్టి ఇంతకాలమైనా జనసేనకు ఓట్లేసి గెలిపించండని అడగటమే పవన్ కు తెలీటం లేదు. ఎంతసేపు జగన్ కు ఓటేయద్దు, వైసీపీని ఓడించమనే పాటే వినిపిస్తున్నారు. ఇపుడు కూడా సభలో మాట్లాడుతూ గోదావరి జిల్లా జనాలు బాగా చైతన్యవంతులని, ఎవరికి ఓట్లేయాలో బాగా తెలుసని చెబుతునే ఎవరికి ఓట్లేయాలో తేల్చుకోమని జనాలకు బంపరాఫర్ ఇచ్చారు. జనసేనను జనాలు ఎందుకు గెలిపించాలి ? జనసేనను గెలిపిస్తే వచ్చే ఉపయోగాలేమిటి అనే విషయంలో పవన్ కే సరైన క్లారిటీ లేదు. ఇలాంటి వ్యక్తి కూడా ఎన్నికలకు జనసేన సిద్ధమని చెబితే ఎవరు నమ్ముతారు ?
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…