వైఎస్ఆర్సీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కలకలం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అటు ఎంపీ తమ మొండి పట్టును కొనసాగిస్తుండటంతో ఏం జరుగుతుందనే ఆసక్తిని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నరసాపురం ఎంపీపై అనర్హత వేటు వేయాలన్న ఆలోచనలో వైసీపీ ఉందని తెలుస్తోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ రఘురామ కృష్ణంరాజు కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా రక్షణ కల్పించాలంటూ రఘురామకృష్ణంరాజు లోక్సభ స్పీకర్, కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అనంతరం ఆయన పార్టీ నిబందనలు ఉల్లంఘిస్తున్నారంటూ నోటీసులు ఇచ్చింది. అయితే, రఘురామకృష్ణంరాజు ఆ నోటీసులకు ఊహించని స్పందన ఇచ్చారు.
ఢిల్లీ వెళ్లిన రఘురామకృష్ణంరాజు.. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర మంత్రులను కలవడం వంటి చర్యలతో వైసీపీ పెద్దలకు షాక్ ఇచ్చారు. ఇక్కడితో ఆపేయకుండా తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేశానని, తనకు నోటీసు ఇచ్చిన లెటర్ హెడ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉందని లాజిక్ లేవనెత్తారు. లెటర్ హెడ్కు, తనకు పోటీ సమయంలో ఇచ్చిన బీఫామ్కు తేడా ఉందని పేర్కొంటూ నోటీసుకు చట్టబద్ధత లేదని ట్విస్ట్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ అధిష్టానాన్ని, ఏపీ సీఎం జగన్ను ఇరకాటంలో పడేస్తున్న తరుణంలో, వైసీపీ అధిష్టానం అసంతృప్తిగా ఉండటమే కాకుండా ఆయన చర్యలను సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఎంపీపై అనర్హత పిటిషన్ వేయడంపై వివిధ రకాల సమీకరణాలు పరిశీలించిన అనంతరం అనర్హతకే వైసీపీ మొగ్గు చూపిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజు పై త్వరలోనే లోకసభ స్పీకర్కు అనర్హత పిటిషన్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. తద్వారా ఆయన తొడగొడుతున్న తీరుకు జవాబు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 1, 2020 1:01 pm
ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసిన నేపథ్యంలో దీనికి చట్టబద్ధత కలిగింది. అయితే.. ఇక నుంచి అమరావతిని ప్రత్యేకంగా…
శత్రువులో సైతం మంచి లక్షణం ఉంటే మెచ్చుకునే సంస్కృతి భారత్ సొంతం. రామాయణ, భారత, భాగవతాలు కూడా ఇదే చెబుతున్నాయి.…
ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో పెద్ది విడుదల తేదీ గురించి ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 30 రాదని కన్ఫర్మ్ అయ్యాక…
భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న…
ఫిబ్రవరి 28: ప్రపంచం నిద్రలేచి కళ్లు నలుముకుంటున్న సమయం.. ఇంతలో ఏ టీవీ పెట్టినా.. ఒకటే బ్రేకింగ్ న్యూస్. ఇరాన్పై…
బలవంతుడు బలవంతుడే అన్నట్టు.. రాజకీయం.. రాజకీయమే!. ఈ మాట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి…