Political News

విలీనం.. జ‌న‌సేన.. కొన్ని వాస్త‌వాలు..!

అవును.. ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చకు జ‌న‌సేన తెర‌దీసింది. తాజాగా గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించిన జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చారు. ఈ క్ర‌మంలో వైసీపీ స‌ర్కార‌పై విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాలంటే.. మేలు కావాలంటే.. త‌మ ను ఎన్నుకోవాల‌ని.. ఆయ‌న సూచించారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న పార్టీని విలీనం చేయాలని.. ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన‌ట్టు చెప్పారు.

తాను ప్రాణం ఉన్నంత వ‌ర‌కు.. విలీనం చేసే ప్ర‌స‌క్తి లేద‌ని.. పోరాటం చేస్తామ‌ని.. గెలిచినా.. ఓడినా.. ప్ర‌జల‌తోనే ఉంటామ‌ని.. ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. విలీనం అనే మాటే ఉత్ప‌న్నం కాద‌ని అన్నారు. అయితే.. ఇక్క‌డే కొన్ని సందేహాలు వ‌స్తున్నాయి. అస‌లు ప‌వ‌న్‌ను పార్టీ విలీనం చేయ‌మ‌ని ఎవ‌రు అడిగారు? ఎందుకు అడిగారు? అనేది ఒకటి. ఒక‌వేళ అడిగి ఉంటే.. బీజేపీనే అడిగి ఉండాలి. కానీ, వాస్త‌వానికి ఆ పార్టీ అలా అడిగే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. గెలిచిన వారిని తీసుకోవ‌డ‌మే ఆ పార్టీకి తెలుసు.

అంతేత‌ప్ప‌.. ఒక్కొక్క మెట్టు ఎక్కి.. పార్టీని డెవ‌ల‌ప్ చేసే అవ‌కాశం ఆ పార్టీకి లేదు. త‌న‌లో ఎన్ని పార్టీలు క‌లిసినా.. ఏపీలో పుంజుకోవ‌డం బీజేపీకి చాలా క‌ష్టం. ఈ నేప‌థ్యంలో అస‌లు ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా ఓటింగ్ లేని జ‌న‌సేన‌ను క‌లుపుకొని ముందుకు వెళ్లాల‌ని బీజేపీ అనుకుంటుందా? అనేది ప్ర‌శ్న‌. మ‌రో రీజ‌న్‌.. అస‌లు ఎవ‌రైనా.. ఒక పార్టీని విలీనం చేసుకునేందుకు ముందుకు వ‌చ్చారంటే.. ఆ పార్టీకి.. అంతో ఇంతో.. ఓటింగ్ ఉండాలి. అదేస‌మ‌యంలో ప్ర‌జా ప్ర‌తినిధుల బ‌లం కూడా ఉండాలి.

ఈ రెండు ప‌రంగా చూస్తే.. జ‌న‌సేన‌కు ఉన్న ఓటు బ్యాంకు 5 శాతం లోపే. కొన్ని జిల్లాల్లో అయితే.. అది కూడా లేదు. నాయ‌కుల పరంగా చూసుకున్నా.. బ‌ల‌మైన నాయ‌కులు పార్టీకి లేకుండా పోయారు. ఇక‌, గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా త‌న దారి తాను చూసుకున్నారు. అంటే.. మొత్తానికి జ‌న‌సేన పార్టీ తాను ఊహించుకుంటున్న స్థాయిలో అయితే లేదు. మ‌రి అలాంట‌ప్పుడు.. ఈ పార్టీని ఎవ‌రు మాత్రం భుజాన వేసుకుంటారు? అనేది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం పవ‌న్ చేసిన వ్యాఖ్య‌లు కేవ‌లం.. కార్య‌క‌ర్త‌ల్లో ఒకింత ధైర్యం నింపేందుకేన‌ని ఆ కోణంలోనే ఆయ‌న వ్యాఖ్యానించి ఉంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 17, 2022 2:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago