Political News

వ‌చ్చే నెలే ముహూర్తం.. జ‌గ‌న్ వ్యూహం ఇదే..!

అనుకున్న‌ది సాధించ‌డ‌మే త‌ప్ప‌.. వెన‌క్కి వెళ్లే మ‌న‌స్త‌త్వం.. రాజ‌కీయాల్లో చాలా మందికి ఉండ‌దు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో అయితే.. ఇది మ‌రింత ఎక్కువ‌. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్న‌ది సాధించారే త‌ప్ప‌.. ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేదు. ఒక‌టి రెండు హామీలు మిన‌హా.. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేసేందుకు వ్యూహాలు వేసుకుని.. అవ‌స‌ర‌మైతే.. అప్పులు చేసైనా కూడా.. ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలోనే తాను అనుకున్న మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగు తున్నారు. 2020లోనే ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఈ విష‌యంలో జ‌గ‌న్ అడుగులు ముందుకు ప‌డ‌డం లేద‌నేది వాస్త‌వం. ఎందుకంటే.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వ‌చ్చాయి. రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని రాష్ట్ర హైకోర్టు స్ప‌ష్టం చేయ‌డం.. దీనిపై రైతులు సుదీర్ఘ యుద్ధం చేయ‌డంతో కొంత ఆల‌స్యం అయితే.. అయింది. అయితే.. ఇప్పుడు మ‌రోసారి జ‌గ‌న్ ముందుకు పోతున్న‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న్ వ్యూహం ప్ర‌కారం.. క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని, అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌ధాని, విశాఖ‌లో పాల‌న రాజ‌ధాని ఏర్పాటు కావాలి. అయితే.. ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో శాస‌న స‌భ ఉన్నందున ఇక్క‌డ దీనిని కొన‌సాగించ‌నున్నారు. ఇక‌, క‌ర్నూలులో న్యాయ‌రాజధాని ఏర్పాటు కావాలి. దీనికి కేంద్రం స‌హ‌కారం అవ‌స‌రం. తాజాగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కేంద్రానికి జ‌గ‌న్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో దీనిపై బీజేపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకునేవీలు క‌నిపిస్తోంది.

ఇది అటు బీజేపీకి కూడా మేలు చేయ‌నుంది. గ‌తంలో క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామ‌ని.. బీజేపీ కూడా ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చింది. ఇప్పుడు అది నెర‌వేర్చ‌డం ద్వారా.. ఇటు జ‌గ‌న్‌కు, అటు బీజేపీకి కూడా లాభ‌మే. మ‌రోవైపు.. ఎటొచ్చీ విశాఖ‌లోపాల‌నా రాజ‌ధానే జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మార‌నుంది. అయితే.. దీనికి కూడా జ‌గ‌న్ మైండ్ బ్లాంక్ అయ్యే వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

తాను(సీఎం) ఎక్క‌డ ఉంటే అదే రాజ‌ధాని క‌నుక‌.. తాను వ‌చ్చే శ్రావ‌ణ మాసం(ఆగ‌స్టు)లో విశాఖ‌కు వెళ్లిపోయి.. అక్క‌డ నుంచి పాల‌న చేస్తే.. అదే రాజ‌ధాని అయిపోతుందని అనుకుంటున్నారు. త‌ర్వాత‌.. ఈ కోర్టు చిక్కులు నెమ్మ‌దిగా తొల‌గించుకుని.. మూడు రాజ‌ధానుల‌ను సాకారం చేసుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 17, 2022 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

36 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

1 hour ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

6 hours ago