Political News

వ‌చ్చే నెలే ముహూర్తం.. జ‌గ‌న్ వ్యూహం ఇదే..!

అనుకున్న‌ది సాధించ‌డ‌మే త‌ప్ప‌.. వెన‌క్కి వెళ్లే మ‌న‌స్త‌త్వం.. రాజ‌కీయాల్లో చాలా మందికి ఉండ‌దు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో అయితే.. ఇది మ‌రింత ఎక్కువ‌. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్న‌ది సాధించారే త‌ప్ప‌.. ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేదు. ఒక‌టి రెండు హామీలు మిన‌హా.. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేసేందుకు వ్యూహాలు వేసుకుని.. అవ‌స‌ర‌మైతే.. అప్పులు చేసైనా కూడా.. ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలోనే తాను అనుకున్న మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగు తున్నారు. 2020లోనే ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఈ విష‌యంలో జ‌గ‌న్ అడుగులు ముందుకు ప‌డ‌డం లేద‌నేది వాస్త‌వం. ఎందుకంటే.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వ‌చ్చాయి. రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని రాష్ట్ర హైకోర్టు స్ప‌ష్టం చేయ‌డం.. దీనిపై రైతులు సుదీర్ఘ యుద్ధం చేయ‌డంతో కొంత ఆల‌స్యం అయితే.. అయింది. అయితే.. ఇప్పుడు మ‌రోసారి జ‌గ‌న్ ముందుకు పోతున్న‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న్ వ్యూహం ప్ర‌కారం.. క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని, అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌ధాని, విశాఖ‌లో పాల‌న రాజ‌ధాని ఏర్పాటు కావాలి. అయితే.. ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో శాస‌న స‌భ ఉన్నందున ఇక్క‌డ దీనిని కొన‌సాగించ‌నున్నారు. ఇక‌, క‌ర్నూలులో న్యాయ‌రాజధాని ఏర్పాటు కావాలి. దీనికి కేంద్రం స‌హ‌కారం అవ‌స‌రం. తాజాగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కేంద్రానికి జ‌గ‌న్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో దీనిపై బీజేపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకునేవీలు క‌నిపిస్తోంది.

ఇది అటు బీజేపీకి కూడా మేలు చేయ‌నుంది. గ‌తంలో క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామ‌ని.. బీజేపీ కూడా ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చింది. ఇప్పుడు అది నెర‌వేర్చ‌డం ద్వారా.. ఇటు జ‌గ‌న్‌కు, అటు బీజేపీకి కూడా లాభ‌మే. మ‌రోవైపు.. ఎటొచ్చీ విశాఖ‌లోపాల‌నా రాజ‌ధానే జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మార‌నుంది. అయితే.. దీనికి కూడా జ‌గ‌న్ మైండ్ బ్లాంక్ అయ్యే వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

తాను(సీఎం) ఎక్క‌డ ఉంటే అదే రాజ‌ధాని క‌నుక‌.. తాను వ‌చ్చే శ్రావ‌ణ మాసం(ఆగ‌స్టు)లో విశాఖ‌కు వెళ్లిపోయి.. అక్క‌డ నుంచి పాల‌న చేస్తే.. అదే రాజ‌ధాని అయిపోతుందని అనుకుంటున్నారు. త‌ర్వాత‌.. ఈ కోర్టు చిక్కులు నెమ్మ‌దిగా తొల‌గించుకుని.. మూడు రాజ‌ధానుల‌ను సాకారం చేసుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 17, 2022 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

17 minutes ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

17 minutes ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

1 hour ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

2 hours ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

2 hours ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

2 hours ago