Political News

మేమేమ‌న్నా.. డ‌బ్బులు ప్రింట్ చేస్తున్నామా?: బొత్స

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. విదేశీ ఉన్నత విద్య పథకాన్నినిలుపుదల చేశారన్న విపక్షాల విమర్శలను మంత్రి బొత్స ఖండించారు. అమెరికా వెళ్తా అనగానే డబ్బులు ఇచ్చేస్తామా? అని ఆయన ప్రశ్నించారు. మెరిట్ విద్యార్థులకే విదేశీ విద్య ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ విధానమని వెల్లడించారు. “ఎవ‌రో వ‌స్తారు. అమెరికా వెళ్తామంటారు.. డ‌బ్బులు ఇచ్చేస్తామా? ప్ర‌భుత్వం ఏమ‌న్నా.. డ‌బ్బులు ముద్రిస్తోంద‌ని అనుకుంటున్నారా?” అని ఆయ‌న ఫైర‌య్యారు.

విదేశీ ఉన్నత విద్య పథకాన్నినిలుపుదల చేశారన్న విపక్షాల విమర్శలను బొత్స తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాల మూసేశారంటే విద్యాశాఖ మంత్రిగా దానికి బాధ్యత వహిస్తానన్నారు. ఎక్కడా పాఠశాలలు మూసివేయలేదని చెప్పారు. పాఠశాలల్లో తరగతుల విలీనంపై దాదాపు 270 అభ్యంతరాలు వచ్చాయని వాటిని పరిశీలిస్తామని చెప్పారు. 3,4,5 తరగతులను తరలించిన తర్వాత ఆ పాఠశాలల్లో 1,2 తరగతులతో పాటూ ఫౌండేషన్ స్కూల్ తీసుకొస్తామని తెలిపారు.

ఉపాధ్యాయుల వినతులను పరిగణలోకి తీసుకుని జీవో 117కు సవరణ చేశామన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరొక ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో 150 మంది విద్యార్థులు సంఖ్య దాటితే ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

మెరిట్ విద్యార్థులకే విదేశీ విద్య ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ విధానమని, ఈ ప‌థ‌కాన్ని అంద‌రికీ అమ‌లు చేయ‌లేమ‌ని మంత్రి బొత్స వెల్లడించారు. ఆ మేరకే విదేశీ విద్య చదువుతున్న విద్యార్థుల్లో 100 శాతం ప్రతిభ ఉన్న వారికే 100 శాతం వేతనం ఇస్తామన్నారు. అందులోనూ అత్యుత్తమ ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో చదివే వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మ‌రి బొత్స వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు ఎల రియాక్ట్ అవుతాయో చూడాలి.

This post was last modified on July 17, 2022 7:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

4 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

8 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

9 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

12 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

13 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

14 hours ago