Political News

ద‌ద్ద‌రిల్లిన ‘సీఎం స‌ర్ గుడ్ మార్నింగ్‌’

సీఎం సార్‌ గుడ్‌ మార్నింగ్‌.. అంటూ జనసేన కార్యకర్తలు, నాయకులు రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లు వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో హోరెత్తిపోయింది. రోడ్లన్నీ ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా ఏమాత్రం ప్యాచ్‌ వర్క్‌లు కూడా వేయలేక పోయారని ధ్వజమెత్తారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్‌, పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

గోతుల రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారని జనసేన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నాయకురాలు గవర లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై గోతిలో నీటి దగ్గర ఆమె నిరసన తెలిపారు. పట్టణ పరిధిలో గోతుల దగ్గర జనేసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు.

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న తెలుపుతున్న విష‌యం తెలిసిందే. ఏపీ రోడ్ల దుస్థితిపై జ‌న‌సేన నాయ‌కులు చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్లో.. ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్ ‘ అనే నినాదంతో.. ఛిద్రమైన రహదారుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో జనసేన కార్యకర్తలు, నాయకులకు పోస్టు చేస్తున్నారు.

రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియచేసేలా ఉన్న ఫొటోల‌ను షేర్ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆయా ప్రాంతాల‌కువెళ్లి.. ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. దీనిలో లోతైన గోతులు ఉన్న రోడ్ల ఫొటోను పోస్టుచేస్తున్నారు.

‘గుడ్ మార్నింగ్ సీఎం సార్ ‘ అనే హ్యాష్ ట్యాగ్ తో.. ఛిద్రమైన రహదారుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని.. జనసేన కార్యకర్తలు, నాయకులకు సూచించారు. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు.

ప‌ది వేలు ఇచ్చి.. ఆటోవాలా అస‌హనం

ఇక‌, ఓ ఆటోవాలా.. ఏపీ సీఎం జ‌గ‌న్‌.. మంత్రుల‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ర‌హ‌దారులు న‌ర‌కంగా ఉన్నాయంటూ.. ఆయ‌న ధైర్యంగా సెల్పీ వీడియో తీసి.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. “ప‌ది వేలు వాహ‌న మిత్ర ఇచ్చావు. ఇప్పుడు రోడ్లు ఇలా ఉండే స‌రికి పాతిక వేలు బండి బాగు చేయించ‌డానికి ఖ‌ర్చ‌యింది” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “నీ కో న‌మ‌స్కారం జ‌గ‌న్ అన్న‌.. ” అంటూ.. వ్యాఖ్యానించాడు.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

21 minutes ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

48 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

2 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago