జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే.. ఈ యాత్ర ఆయన ముందుగానే షెడ్యూల్ చేసుకున్న టూర్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కలవనున్నారు. వారిని ఓదార్చి రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నారు. అయితే.. పవన్ టూర్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న యాత్ర ముందుగానే షెడ్యూల్ చేసుకున్నది.
అయితే.. అదేసమయంలో ఇప్పుడు ఈ జిల్లాలోని కోనసీమ, అల్లూరి జిల్లాల ప్రజలు ఆకస్మిక వరదలతో అతలాకుతలం అవుతున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వం చెబుతున్నా.. అనుకున్న విధంగా అయితే.. ఇక్కడ బాధితులకు సాయం అందడం లేదనేది వాస్తవం. అనేక మంది ప్రజలు ఇంకా లంక గ్రామాల్లో చిక్కుకుపోయారు.
మరోవైపు.. అధికార పార్టీ నాయకులు.. ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉంటున్నారు. వారు కనీసం బయటకు కూడా రావడం లేదు. మొత్తం ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో బాధితులకు భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఎలాగూ జిల్లాకు వెళ్తున్న పవన్.. వరద బాధితులను కూడా పరామర్శిస్తే.. ఆయనకు రాజకీయంగా మైలేజీ చేకూరడంతోపాటు.. బాధితుల పక్షాన ఆయన గళం వినిపిస్తే.. ప్రభుత్వం కూడా ముందుకు కదులుతుందని.. వారికి మేలు జరుగుతుందని అంటున్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు కేవలం కొందరికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రశ్నించే గళం వినిపిస్తే.. సర్కారులో చలనం కలుగుతుందని బాధితులు వాపోతున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు రాకపోవడం.. కనీసం బాధితులకు తాగు నీరు, ఆహారం కూడా అందకపోవడం వంటి నేపథ్యంలో పవన్ తన టూర్లో స్వల్ప మార్పులు చేసుకునైనా.. బాధితులను పరామర్శించాలని అంటున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 16, 2022 9:21 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…