Political News

ఇప్పుడు ఈ యాత్ర బెట‌రేమో.. ప‌వ‌న్ స‌ర్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా ఉమ్మ‌డి తూర్పు గోదావరి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. ఈ యాత్ర ఆయ‌న ముందుగానే షెడ్యూల్ చేసుకున్న టూర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జిల్లాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను క‌ల‌వ‌నున్నారు. వారిని ఓదార్చి రూ.ల‌క్ష చొప్పున సాయం అందించ‌నున్నారు. అయితే.. ప‌వ‌న్ టూర్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న యాత్ర ముందుగానే షెడ్యూల్ చేసుకున్న‌ది.

అయితే.. అదేస‌మ‌యంలో ఇప్పుడు ఈ జిల్లాలోని కోన‌సీమ‌, అల్లూరి జిల్లాల ప్ర‌జ‌లు ఆక‌స్మిక వ‌ర‌ద‌ల‌తో అతలాకుత‌లం అవుతున్నారు. ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని.. బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. అనుకున్న విధంగా అయితే.. ఇక్క‌డ బాధితుల‌కు సాయం అంద‌డం లేద‌నేది వాస్త‌వం. అనేక మంది ప్ర‌జ‌లు ఇంకా లంక గ్రామాల్లో చిక్కుకుపోయారు.

మ‌రోవైపు.. అధికార పార్టీ నాయ‌కులు.. ఎక్క‌డిక‌క్కడ ఇళ్ల‌లోనే ఉంటున్నారు. వారు క‌నీసం బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. మొత్తం ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌లు కూడా వారి వారి ప‌నుల్లో బిజీగా ఉన్నారు. దీంతో బాధితులకు భ‌రోసా లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో ఎలాగూ జిల్లాకు వెళ్తున్న ప‌వ‌న్‌.. వ‌ర‌ద బాధితుల‌ను కూడా ప‌రామర్శిస్తే.. ఆయ‌న‌కు రాజ‌కీయంగా మైలేజీ చేకూర‌డంతోపాటు.. బాధితుల ప‌క్షాన ఆయ‌న గ‌ళం వినిపిస్తే.. ప్ర‌భుత్వం కూడా ముందుకు క‌దులుతుంద‌ని.. వారికి మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న సేవ‌లు కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ప్ర‌శ్నించే గ‌ళం వినిపిస్తే.. స‌ర్కారులో చ‌ల‌నం క‌లుగుతుంద‌ని బాధితులు వాపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అధికార పార్టీ నేత‌లు రాక‌పోవ‌డం.. క‌నీసం బాధితుల‌కు తాగు నీరు, ఆహారం కూడా అంద‌క‌పోవ‌డం వంటి నేప‌థ్యంలో ప‌వ‌న్ త‌న టూర్‌లో స్వ‌ల్ప మార్పులు చేసుకునైనా.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించాల‌ని అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 16, 2022 9:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

2 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

2 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

2 hours ago

విజయ్ నిర్మాతలకు ఊహించని పండగ

అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…

3 hours ago

మే నెల బోణీ చేదుగా ఉంది

కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…

4 hours ago

ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర సీఎం ఓటమి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…

4 hours ago