Political News

ఇప్పుడు ఈ యాత్ర బెట‌రేమో.. ప‌వ‌న్ స‌ర్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా ఉమ్మ‌డి తూర్పు గోదావరి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. ఈ యాత్ర ఆయ‌న ముందుగానే షెడ్యూల్ చేసుకున్న టూర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జిల్లాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను క‌ల‌వ‌నున్నారు. వారిని ఓదార్చి రూ.ల‌క్ష చొప్పున సాయం అందించ‌నున్నారు. అయితే.. ప‌వ‌న్ టూర్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న యాత్ర ముందుగానే షెడ్యూల్ చేసుకున్న‌ది.

అయితే.. అదేస‌మ‌యంలో ఇప్పుడు ఈ జిల్లాలోని కోన‌సీమ‌, అల్లూరి జిల్లాల ప్ర‌జ‌లు ఆక‌స్మిక వ‌ర‌ద‌ల‌తో అతలాకుత‌లం అవుతున్నారు. ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని.. బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. అనుకున్న విధంగా అయితే.. ఇక్క‌డ బాధితుల‌కు సాయం అంద‌డం లేద‌నేది వాస్త‌వం. అనేక మంది ప్ర‌జ‌లు ఇంకా లంక గ్రామాల్లో చిక్కుకుపోయారు.

మ‌రోవైపు.. అధికార పార్టీ నాయ‌కులు.. ఎక్క‌డిక‌క్కడ ఇళ్ల‌లోనే ఉంటున్నారు. వారు క‌నీసం బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. మొత్తం ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌లు కూడా వారి వారి ప‌నుల్లో బిజీగా ఉన్నారు. దీంతో బాధితులకు భ‌రోసా లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో ఎలాగూ జిల్లాకు వెళ్తున్న ప‌వ‌న్‌.. వ‌ర‌ద బాధితుల‌ను కూడా ప‌రామర్శిస్తే.. ఆయ‌న‌కు రాజ‌కీయంగా మైలేజీ చేకూర‌డంతోపాటు.. బాధితుల ప‌క్షాన ఆయ‌న గ‌ళం వినిపిస్తే.. ప్ర‌భుత్వం కూడా ముందుకు క‌దులుతుంద‌ని.. వారికి మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న సేవ‌లు కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ప్ర‌శ్నించే గ‌ళం వినిపిస్తే.. స‌ర్కారులో చ‌ల‌నం క‌లుగుతుంద‌ని బాధితులు వాపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అధికార పార్టీ నేత‌లు రాక‌పోవ‌డం.. క‌నీసం బాధితుల‌కు తాగు నీరు, ఆహారం కూడా అంద‌క‌పోవ‌డం వంటి నేప‌థ్యంలో ప‌వ‌న్ త‌న టూర్‌లో స్వ‌ల్ప మార్పులు చేసుకునైనా.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించాల‌ని అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 16, 2022 9:21 pm

Share

Recent Posts

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

4 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

11 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

12 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

13 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

15 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

18 hours ago