Political News

ఇప్పుడు ఈ యాత్ర బెట‌రేమో.. ప‌వ‌న్ స‌ర్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా ఉమ్మ‌డి తూర్పు గోదావరి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. ఈ యాత్ర ఆయ‌న ముందుగానే షెడ్యూల్ చేసుకున్న టూర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జిల్లాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను క‌ల‌వ‌నున్నారు. వారిని ఓదార్చి రూ.ల‌క్ష చొప్పున సాయం అందించ‌నున్నారు. అయితే.. ప‌వ‌న్ టూర్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న యాత్ర ముందుగానే షెడ్యూల్ చేసుకున్న‌ది.

అయితే.. అదేస‌మ‌యంలో ఇప్పుడు ఈ జిల్లాలోని కోన‌సీమ‌, అల్లూరి జిల్లాల ప్ర‌జ‌లు ఆక‌స్మిక వ‌ర‌ద‌ల‌తో అతలాకుత‌లం అవుతున్నారు. ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని.. బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. అనుకున్న విధంగా అయితే.. ఇక్క‌డ బాధితుల‌కు సాయం అంద‌డం లేద‌నేది వాస్త‌వం. అనేక మంది ప్ర‌జ‌లు ఇంకా లంక గ్రామాల్లో చిక్కుకుపోయారు.

మ‌రోవైపు.. అధికార పార్టీ నాయ‌కులు.. ఎక్క‌డిక‌క్కడ ఇళ్ల‌లోనే ఉంటున్నారు. వారు క‌నీసం బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. మొత్తం ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌లు కూడా వారి వారి ప‌నుల్లో బిజీగా ఉన్నారు. దీంతో బాధితులకు భ‌రోసా లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో ఎలాగూ జిల్లాకు వెళ్తున్న ప‌వ‌న్‌.. వ‌ర‌ద బాధితుల‌ను కూడా ప‌రామర్శిస్తే.. ఆయ‌న‌కు రాజ‌కీయంగా మైలేజీ చేకూర‌డంతోపాటు.. బాధితుల ప‌క్షాన ఆయ‌న గ‌ళం వినిపిస్తే.. ప్ర‌భుత్వం కూడా ముందుకు క‌దులుతుంద‌ని.. వారికి మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న సేవ‌లు కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ప్ర‌శ్నించే గ‌ళం వినిపిస్తే.. స‌ర్కారులో చ‌ల‌నం క‌లుగుతుంద‌ని బాధితులు వాపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అధికార పార్టీ నేత‌లు రాక‌పోవ‌డం.. క‌నీసం బాధితుల‌కు తాగు నీరు, ఆహారం కూడా అంద‌క‌పోవ‌డం వంటి నేప‌థ్యంలో ప‌వ‌న్ త‌న టూర్‌లో స్వ‌ల్ప మార్పులు చేసుకునైనా.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించాల‌ని అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 16, 2022 9:21 pm

Share

Recent Posts

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

35 minutes ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

1 hour ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

2 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

2 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

3 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

3 hours ago