తొందరలోనే మద్యం షాపులను ప్రభుత్వం వదిలించుకోబోతోందనే ప్రచారం మొదలైంది. గతంలో ఉన్నట్లే షాపులన్నింటినీ మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకే అప్పగించేయాలని జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో డిసైడ్ అయ్యిందట. ఇంతటి కీలక నిర్ణయానికి కారణం ఏమిటంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవటమేనట. ప్రస్తుతం మద్యం ద్వారా ఆదాయం బాగానే వస్తున్నా అనుకున్నంత స్ధాయిలో రావటం లేదని ఉన్నతాధికారులు బాధపడిపోతున్నారట.
ప్రస్తుతం మద్యం ద్వారా ఏడాదికి సుమారు రు. 25 వేల కోట్లు వ్యాపారం జరుగుతోంది. ఇందులో నుండి సుమారు రు. 20 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అయితే అంచనా వేసిన దానికన్నా వస్తున్నది తక్కువగానే ఉన్నట్లు ఉన్నతాధికారులు జగన్ తో చెప్పారట. మరి అంచనాలకు తగ్గట్లు లేదా అంతకన్నా ఎక్కువగా ఆదాయం రావాలంటే ఏమి చేయాలి ? ఏమి చేయాలంటే వెంటనే మద్యం షాపుల నిర్వహణ నుండి ప్రభుత్వం తప్పుకుని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఉన్నతాధికారులు సూచించారట.
ప్రభుత్వమే నిర్వహించటానికి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటానికి మధ్య తేడా ఉంది. షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది కాబట్టి డిపాజిట్లు ఉండవు. అలాగే మద్యం అమ్మకాలకు ప్రభుత్వం కొన్ని పరిమితులను పెట్టుకున్నది. అదే ప్రైవేటువ్యక్తులకు షాపులను అప్పగిస్తే వారినుండి దరఖాస్తు, డిపాజిట్ల పేరుతో సుమారు రు. 2 వేల కోట్లు వస్తుంది.
అలాగే నెలకు ఇపుడు మద్యం అమ్మకాల ద్వారా రు. 2 వేల కోట్లువస్తోంది. దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే అమ్మకాలు డబల్ అంటే రు. 4 వేల కోట్లకు పెరిగే అవకావముంది. మద్యం ఎంత ఎక్కువగా అమ్ముడుపోతే ప్రభుత్వానికి ఆదాయం అంత ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇపుడు వస్తున్న ఆదాయంకన్నా ప్రైవేటువ్యక్తులకు అప్పగిస్తే సుమారు రు. 5 వేల కోట్లు అదనపు ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 16, 2022 12:21 pm
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్…
మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…
పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…
అడుసు తొక్కనేల…కాలు కడగనేల..అనే సామెతను పెద్దలు ఊరికే వేయలేదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు,…
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రెండు దశాబ్దాల కిందటే తెరంగేట్రం చేశాడు. అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులూ ఒకరి…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన నాయకుల కోరికలకు కూటమి పెద్ద టీడీపీ గ్రీన్సిగ్నల్…