అసలే మూడు ప్రధాన పార్టీల మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఒకవైపు టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అని బీజేపీ సవాళ్ళ మీద సవాళ్ళు చేస్తంది. వీళ్ళద్దరు కాదు అధికారం మాదే అని కాంగ్రెస్ నేతలు తొడలు చరుస్తున్నారు. దీంతో తెలంగాణాలో రాజకీయ వేడితో వాతావరణమంతా బాగా కాలుష్యమైపోయింది.
సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే ఆరా అనే సర్వే సంస్ధ సర్వే ఫలితాలను విడుదలచేసింది. అందులో టీఆర్ఎస్సే మళ్ళీ అధికారంలోకి రాబోతోందని చెప్పింది. ఇదే సమయంలో బీజేపీ ఓట్లషేరును గణనీయంగా పెంచుకోబోతోందని కూడా చెప్పింది. పనిలోపనిగా కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గిపోతోందని ప్రకటించింది. ఈ మూడు పరస్పర విరుద్ధమైన ఫలితాల కారణంగా మూడు పార్టీల మధ్య గొడవలు మరింతగా పెరిగిపోయాయి.
జనాల మైండ్ సెట్ మార్చేందుకు బీజేపీయే ఆరా సంస్ధతో ఒక బోగస్ సర్వే ఫలితమని చెప్పి రిలీజ్ చేయించిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. పోటీచేయటానికి 119 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే లేని పార్టీకి 30 శాతం ఓట్లు ఎలావస్తాయని కారుపార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు కూడా ఎదురుదాడులకు దిగారు. కేసీయారే ఆరా సంస్ధతో ఒక బోగస్ సర్వే చేయించారని చెప్పారు. ప్రజావ్యతిరేకత విపరీతంగా కనబడుతుంటే మళ్ళీ టీఆర్ఎస్ ఎలాగ అధికారంలోకి వస్తుందని నిలదీస్తున్నారు.
ఈ రెండుపార్టీలను కాంగ్రెస్ నేతలు దుమ్ము దులిపేస్తున్నారు. ఆరా సంస్ధను టీఆర్ఎస్, బీజేపీ నేతలు మ్యానేజ్ చేసి కాంగ్రెస్ ఓట్లశాతం తగ్గిపోతోందని ఉద్దేశ్యపూర్వకంగానే చెప్పించారంటు మండిపడుతున్నారు. ఆరా సంస్ధ యాజమాన్యం పై రెండుపార్టీల కోసమే పనిచేస్తోందంటు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీయార్, నరేంద్రమోడీ పైన వ్యతిరేకత కారణంగా అధికారంలోకి రాబోయేది తామేనంటు కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ సర్వేను తాము నమ్మేదిలేదని కూడా అంటున్నారు. మొత్తానికి మూడుపార్టీల మధ్య సర్వే చిచ్చు బాగానే రగులుతోంది.
This post was last modified on July 15, 2022 11:25 am
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…