Political News

షర్మిలకు అంత సీనుందా ?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ కు వైఎస్సార్టీపీ గ్రహణం పడుతుందనే చర్చ పెరిగిపోతోంది. కాంగ్రెస్ కు షర్మిల పార్టీ గ్రహణం పట్టడం ఏమిటి ? ఏమిటంటే షర్మిల పార్టీ సొంతంగా ఎక్కువ నియోజకవర్గాల్లో గెలవలేకపోవచ్చు. కానీ దాని ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలపై తప్పకుండా పడుతుందనే చర్చ పెరిగిపోతోంది.

దీనికి హేతువు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కానుగోల ఒక రిపోర్టు ఇచ్చారట. దాని ప్రకారం ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానుల ప్రభావం ఎక్కువగా ఉందని తేలిందట. వీళ్ళమద్దతు ఎక్కువగా షర్మిల పార్టీవైపు ఉండే అవకాశముందని సర్వేలో తేలిందట. ఆ విషయాన్నే సునీల్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి స్పష్టంగా చెప్పారట.

వచ్చే ఎన్నికల్లో 70 సీట్లతో అధికారంలోకి వచ్చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మరీ నేపధ్యంలోనే కాంగ్రెస్ విజయాన్ని షర్మిల దెబ్బకొడుతుందేమో అనే టెన్షన్ మొదలైందట. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రత్యేకించి షర్మిలను పిలిచారు. ఇదే రేవంత్ ఒకపుడు షర్మిల పార్టీని ఒకపార్టీగా గుర్తించటానికే ఇష్టపడని విషయం తెలిసిందే.

షర్మిల పార్టీనుండి కాంగ్రెస్ కు ఓట్లు గండిపడితే గెలుపు అవకాశాలు తగ్గిపోవటం ఖాయం. దాంతో మళ్ళీ ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండేంత ఓపిక కాంగ్రెస్ నేతలకు లేదన్నది వాస్తవం. ఈ పరిస్ధితిని నివారించేందుకు కాంగ్రెస్-షర్మిల మధ్య పొత్తుకుదిరే అవకాశముందనే ప్రచారం పెరుగుతోంది. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ పై అవినీతిపరుడిగా ముద్రవేసి, కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిపైన కేసులు నమోదుచేసి 16 మాసాలు జైలులో ఉంచిన కాంగ్రెస్ పార్టీతో ఇపుడు షర్మిల పొత్తు పెట్టుకుంటారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. చూద్దాం చివరకు ఏమవుతుందో.

This post was last modified on July 13, 2022 10:06 am

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

47 minutes ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

1 hour ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

13 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

14 hours ago