Political News

‘జ‌గ‌న్‌ను ఆ భ‌యం వెంటాడుతోంది’

వైసీపీ రెబ‌ల్ ఎంపీ… విశ్లేష‌కులు.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ వైసీపీపైనా.. ఆ పార్టీ అధ్య‌క్షుడిపైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏ పార్టీకీ.. దేశంలో శాశ్వ‌త అధ్య‌క్షుడు ఉండ‌ర‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎలాశాశ్వ‌త అధ్య‌క్షుడిని నియ‌మించుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై తాను పోరాటం చేస్తాన‌ని అన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. ప్లీనరీలో విజయసాయి ప్రవేశపెట్టిన వైసీపీ శాశ్వత అధ్యక్షుడి తీర్మానంపై ఆయ‌న ఫిర్యాదు చేశారు.

అయితే.. స‌ద‌రు తీర్మానం కాపీ.. త‌న‌కు అందలేదని ఎన్నికల అధికారి చెప్పారని ఎంపీ ర‌ఘురామ తెలిపారు. తీర్మానం అందాక ఈసీ నిర్ణయిస్తుందన్నారు. శాశ్వత అధ్యక్షుడి పదవి అశాశ్వతమని ఎంపీ రఘురామ అన్నారు. వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ తీర్మానంపై ఆయన చర్చించారు. విజయసాయి రెడ్డి తీర్మానం ఇంకా తనకు అందలేదని ఎన్నికల అధికారి చెప్పారని రఘురామ అన్నారు. తీర్మానం అందాక.. ఈసీ నిర్ణయిస్తుందన్నారు.

“శాశ్వత అధ్యక్షుడి పదవి అశాశ్వతం. ఇది మా పార్టీకి ఒక సెట్ బ్యాక్. భయాలు పెట్టుకుని శాశ్వత అధ్యక్షుడు కావాలని జగన్‌ యోచిస్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు. ఇప్పటివరకు ఇలాంటి కేసు ఈసీ ముందుకు రాలేదు. ఇదీ ఈసీ, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.” అని ర‌ఘురామ అన్నారు. జ‌గ‌న్‌ను ఏదో తెలియ‌ని భ‌యం వెంటాడుతోంద‌ని చెప్పారు. ఈ భ‌య‌మే ఆయ‌న ఓట‌మికి దారితీస్తుంద‌ని.. వైసీపీ నిలువునా కాలిపోవ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.

ఇదిలావుంటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ(వైసీపీ) జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో తీర్మానం చేసి ఆమోదించారు. పారదర్శక పాలన-సామాజిక సాధికారత, పరిశ్రమలు-ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయంపై తదితర అంశాలపై తీర్మానాలు చేసిన వైసీపీ నేతలు.. వాటిపై చర్చించారు. దీంతో రాజ‌కీయంగా ఈ శాశ్వ‌త నియామ‌కం దుమారం రేపుతోంది. అన్ని వైపుల నుంచి వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఏ పార్టీ కూడా ఇలా శాశ్వ‌త అధ్య‌క్షుడిని ప్ర‌క‌టించుకున్న దాఖ‌లా లేద‌ని పేర్కొన్నాయి.

This post was last modified on July 11, 2022 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

47 minutes ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

1 hour ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

1 hour ago

విజయ్ నిర్మాతలకు ఊహించని పండగ

అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…

2 hours ago

మే నెల బోణీ చేదుగా ఉంది

కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…

2 hours ago

ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర సీఎం ఓటమి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…

3 hours ago