Political News

విశాఖ ఉక్కును కేంద్రం చంపేస్తోందా ?

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం మెల్లిగా చంపేస్తోంది. విశాఖ స్టీల్స్ లో రెండు రకాల ఉత్పత్తులు జరుగుతుంటాయి. మొదటిదేమో ఉక్కు ఉత్పత్తి కాగా రెండోదేమో విద్యుత్ ఉత్పత్తి. ఆక్సిజన్ కూడా ఉత్పత్తవుతుంది కానీ అది ఫ్యాక్టరీ అవసరాలకు మాత్రమే సరిపోతుంది. కాకపోతే కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైపోయినపుడు కేంద్రం ఆదేశాల కారణంగా ఆక్సిజన్ను కూడా ఉత్పత్తి చేసి దేశానికి అందించిన ఘనత విశాఖ స్టీల్స్ కే సొంతమని అందరికీ తెలుసు.

పై మూడింటిలో దేన్ని ఉత్పత్తి చేయాలన్నా ముఖ్యంగా కావాల్సింది బొగ్గు. ఇపుడా బొగ్గు సరఫరా మీద కేంద్రం అప్రకటిత బ్యాన్ విధించింది. దీని ఫలితంగా అవసరమైన బొగ్గు నిల్వలు అందక ఉక్కు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా పడిపోయింది. ఒడిస్సాలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుండి విశాఖ ఉక్కుకు ఏడాదికి 16.8 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఒప్పందం జరిగింది. ప్రతినెలా 1.4 లక్షల టన్నుల బొగ్గు రావాలి. బొగ్గు సరఫరా అంతా రైల్వే ర్యాక్స్ ద్వారానే జరగుతుంది.

అయితే జూన్ నెలలో ఒక్క ర్యాక్ బొగ్గు కూడా ఫ్యాక్టరీకి అందలేదు. అంటే జూన్ నెల మొత్తంలో మహానది నుండి బొగ్గు సరఫరా కాలేదు. దాంతో మహానదిని పక్కనపెట్టి సింగరేణి నుండి అధికారులు బొగ్గును కొన్నారు. మహానది నుండి అయితే టన్ను బొగ్గు సరఫరాకు 3 వేల రూపాయలు పడితే సింగరేణి నుండి రు. 6300 అయ్యింది. అయినా కూడా సింగరేణి నుండి బొగ్గు సరిపడా అందలేదు. దాంతో లాభం లేదని ప్రైవేటు కంపెనీల నుండి బొగ్గు కొనాలని డిసైడ్ అయ్యింది. ప్రైవేటు కంపెనీల నుండి టన్ను బొగ్గు సరఫరాకు రు. 15 వేలవుతుందని అంచనా వేశారు. దాంతో ఏమి చేయాలో తెలీక అధికారులు దిక్కులుచూస్తున్నారు. అంటే ఇదంతా కూడా కేంద్రం కావాలనే చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఫ్యాక్టరీని ప్రైవేటుకు అప్పగించేయటం లేదా మూసేయాలని నరేంద్ర మోడీ సర్కార్ డిసైడ్ చేసింది. దానికి ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించటంతో మోడీ సర్కార్ ఇలా ఇబ్బందులు పెడుతోంది.

This post was last modified on July 11, 2022 5:03 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

1 hour ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

2 hours ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago