Political News

విశాఖ ఉక్కును కేంద్రం చంపేస్తోందా ?

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం మెల్లిగా చంపేస్తోంది. విశాఖ స్టీల్స్ లో రెండు రకాల ఉత్పత్తులు జరుగుతుంటాయి. మొదటిదేమో ఉక్కు ఉత్పత్తి కాగా రెండోదేమో విద్యుత్ ఉత్పత్తి. ఆక్సిజన్ కూడా ఉత్పత్తవుతుంది కానీ అది ఫ్యాక్టరీ అవసరాలకు మాత్రమే సరిపోతుంది. కాకపోతే కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైపోయినపుడు కేంద్రం ఆదేశాల కారణంగా ఆక్సిజన్ను కూడా ఉత్పత్తి చేసి దేశానికి అందించిన ఘనత విశాఖ స్టీల్స్ కే సొంతమని అందరికీ తెలుసు.

పై మూడింటిలో దేన్ని ఉత్పత్తి చేయాలన్నా ముఖ్యంగా కావాల్సింది బొగ్గు. ఇపుడా బొగ్గు సరఫరా మీద కేంద్రం అప్రకటిత బ్యాన్ విధించింది. దీని ఫలితంగా అవసరమైన బొగ్గు నిల్వలు అందక ఉక్కు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా పడిపోయింది. ఒడిస్సాలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుండి విశాఖ ఉక్కుకు ఏడాదికి 16.8 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఒప్పందం జరిగింది. ప్రతినెలా 1.4 లక్షల టన్నుల బొగ్గు రావాలి. బొగ్గు సరఫరా అంతా రైల్వే ర్యాక్స్ ద్వారానే జరగుతుంది.

అయితే జూన్ నెలలో ఒక్క ర్యాక్ బొగ్గు కూడా ఫ్యాక్టరీకి అందలేదు. అంటే జూన్ నెల మొత్తంలో మహానది నుండి బొగ్గు సరఫరా కాలేదు. దాంతో మహానదిని పక్కనపెట్టి సింగరేణి నుండి అధికారులు బొగ్గును కొన్నారు. మహానది నుండి అయితే టన్ను బొగ్గు సరఫరాకు 3 వేల రూపాయలు పడితే సింగరేణి నుండి రు. 6300 అయ్యింది. అయినా కూడా సింగరేణి నుండి బొగ్గు సరిపడా అందలేదు. దాంతో లాభం లేదని ప్రైవేటు కంపెనీల నుండి బొగ్గు కొనాలని డిసైడ్ అయ్యింది. ప్రైవేటు కంపెనీల నుండి టన్ను బొగ్గు సరఫరాకు రు. 15 వేలవుతుందని అంచనా వేశారు. దాంతో ఏమి చేయాలో తెలీక అధికారులు దిక్కులుచూస్తున్నారు. అంటే ఇదంతా కూడా కేంద్రం కావాలనే చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఫ్యాక్టరీని ప్రైవేటుకు అప్పగించేయటం లేదా మూసేయాలని నరేంద్ర మోడీ సర్కార్ డిసైడ్ చేసింది. దానికి ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించటంతో మోడీ సర్కార్ ఇలా ఇబ్బందులు పెడుతోంది.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

8 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago