వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడితే.. ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారని పవన్ కల్యాణ్ హచ్చరించారు. అలాంటి ఉద్యమం వచ్చిన రోజున.. పరిణామాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
అధికారం ఉందని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తున్నారని.. బలహీనులపై దాడులు పెరిగితే ఉద్యమాలు వస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారు.. జాగ్రత్త అని సూచించారు. విజయవాడలో రెండో విడత జనవాణి – జనసేన భరోసా కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు.
ఎంబీకే భవన్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపుతున్నామని.. సీఎం సంక్షేమ నిధి, ఆరోగ్యశ్రీలో అమలుకాని అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు.
ఈ సందర్భంగా రేణిగుంట మండలం తారకరామనగర్ వాసి తన ఇల్లు లాక్కున్నారని తన బాధను పవన్కు తెలియజేశారు. దీనిపై స్పందించిన పవన్.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని ఎంపీటీసీ లాక్కోవడం దారుణమన్నారు. లాక్కున్న ఇంటిని మళ్లీ మహిళకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఎందరో ఇబ్బంది పడుతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత ఆదివారం నిర్వహించిన జనవాణిలో 427 అర్జీలు వచ్చాయని.. వచ్చే ఆదివారం భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.
This post was last modified on July 10, 2022 2:05 pm
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…