వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్పై పార్టీలో విశ్వసనీయత, నమ్మకం ఉన్న విషయం తెలిసిందే. ఆయన పేరుతో ఆయన ఫొటోతోనే నాయకులు గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ నమ్మకం ఇప్పుడు సడులుతోందనే భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. కుటుంబం విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. రాష్ట్రంలో చర్చకు దారితీస్తున్నాయి. చెల్లిని, తల్లిని.. పక్కన పెట్టారనే వాదన ప్రతిపక్షం నుంచి వినిపిస్తోంది.
షర్మిల, విజయమ్మలను జగన్ వాడుకుని వదిలేశారని ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలు.. ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. అదేసమయంలో నాయకుల మధ్య కూడా చర్చకు వస్తున్నాయి. ఇవి నైతికంగా .. జగన్ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల నాటికి.. ఇదే పరిస్థితి ఉంటే.. జగన్ను నమ్మడం కష్టమనే అభిప్రాయం పెరుగుతోందని అంటున్నారు. ఇప్పటి వరకు జగన్ వెంట తిరిగిన వారు కూడా.. ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు.
ముఖ్యంగా గతంలో జగన్ వెంట తిరిగిన వారు.. ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఉన్న వారు కూడా ఆలోచనలో పడ్డారు. జగన్ను నమ్ముకున్నాం.. అయితే.. తమను ఏం చేస్తారో.. ఏమో.. అనే చర్చ జరుగుతోంది. ఇది వచ్చే ఎన్నికల విషయానికి వస్తే.. ఇబ్బంది ఖాయమని అంటున్నారు. నమ్మకం అనే పునాదులపైనే జగన్ చుట్టూ నాయకులు చేరారు. ఇతర పార్టీల నుంచి వచ్చి.. మరీ చేరడం వెనుక ఉన్న ప్రధాన కారణం కూడా ఇదే.
అయితే.. జగన్ ఇప్పుడు ఇదే విశ్వసనీయతను కోల్పోతున్నారనే వాదన వినిపిస్తోంది. తనను నమ్ముకున్న వారిని ఆయన పక్కన పెట్టేస్తున్నారని.. నాయకులు వాపోతున్నారు. ఇలా అయితే.. కష్టమనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ను బలపరిచేందుకు నాయకులు ఎవరూ ముందుకు రాకపోతే.. ఎలా? కేవలం కొత్తవారినే గెలిపించుకోగలను అనే భావన కూడా సరైందేనా? అనే చర్చ రాజకీయంగా ఊపందుకోవడం గమనార్హం. ఏదేమైనా.. జగన్ అడుగులు వైసీపీలో అభద్రతను పెంచుతున్నాయనడంలో సందేహం లేదు.
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…