వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్పై పార్టీలో విశ్వసనీయత, నమ్మకం ఉన్న విషయం తెలిసిందే. ఆయన పేరుతో ఆయన ఫొటోతోనే నాయకులు గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ నమ్మకం ఇప్పుడు సడులుతోందనే భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. కుటుంబం విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. రాష్ట్రంలో చర్చకు దారితీస్తున్నాయి. చెల్లిని, తల్లిని.. పక్కన పెట్టారనే వాదన ప్రతిపక్షం నుంచి వినిపిస్తోంది.
షర్మిల, విజయమ్మలను జగన్ వాడుకుని వదిలేశారని ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలు.. ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. అదేసమయంలో నాయకుల మధ్య కూడా చర్చకు వస్తున్నాయి. ఇవి నైతికంగా .. జగన్ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల నాటికి.. ఇదే పరిస్థితి ఉంటే.. జగన్ను నమ్మడం కష్టమనే అభిప్రాయం పెరుగుతోందని అంటున్నారు. ఇప్పటి వరకు జగన్ వెంట తిరిగిన వారు కూడా.. ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు.
ముఖ్యంగా గతంలో జగన్ వెంట తిరిగిన వారు.. ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఉన్న వారు కూడా ఆలోచనలో పడ్డారు. జగన్ను నమ్ముకున్నాం.. అయితే.. తమను ఏం చేస్తారో.. ఏమో.. అనే చర్చ జరుగుతోంది. ఇది వచ్చే ఎన్నికల విషయానికి వస్తే.. ఇబ్బంది ఖాయమని అంటున్నారు. నమ్మకం అనే పునాదులపైనే జగన్ చుట్టూ నాయకులు చేరారు. ఇతర పార్టీల నుంచి వచ్చి.. మరీ చేరడం వెనుక ఉన్న ప్రధాన కారణం కూడా ఇదే.
అయితే.. జగన్ ఇప్పుడు ఇదే విశ్వసనీయతను కోల్పోతున్నారనే వాదన వినిపిస్తోంది. తనను నమ్ముకున్న వారిని ఆయన పక్కన పెట్టేస్తున్నారని.. నాయకులు వాపోతున్నారు. ఇలా అయితే.. కష్టమనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ను బలపరిచేందుకు నాయకులు ఎవరూ ముందుకు రాకపోతే.. ఎలా? కేవలం కొత్తవారినే గెలిపించుకోగలను అనే భావన కూడా సరైందేనా? అనే చర్చ రాజకీయంగా ఊపందుకోవడం గమనార్హం. ఏదేమైనా.. జగన్ అడుగులు వైసీపీలో అభద్రతను పెంచుతున్నాయనడంలో సందేహం లేదు.
This post was last modified on July 10, 2022 10:46 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…