Political News

జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త త‌గ్గుతోందా…!

వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై పార్టీలో విశ్వ‌స‌నీయ‌త‌, న‌మ్మ‌కం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయన పేరుతో ఆయ‌న ఫొటోతోనే నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈ న‌మ్మ‌కం ఇప్పుడు స‌డులుతోంద‌నే భావన రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. కుటుంబం విషయంలో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. చెల్లిని, త‌ల్లిని.. పక్క‌న పెట్టార‌నే వాద‌న ప్ర‌తిప‌క్షం నుంచి వినిపిస్తోంది.

ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌ను జ‌గ‌న్ వాడుకుని వ‌దిలేశార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు.. ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్తున్నాయి. అదేస‌మ‌యంలో నాయ‌కుల మ‌ధ్య కూడా చర్చ‌కు వ‌స్తున్నాయి. ఇవి నైతికంగా .. జ‌గన్ విశ్వ‌స‌నీయ‌త‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఇదే ప‌రిస్థితి ఉంటే.. జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయం పెరుగుతోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ వెంట తిరిగిన వారు కూడా.. ఇప్పుడు ఇదే ఆలోచ‌న‌లో ఉన్నారు.

ముఖ్యంగా గ‌తంలో జ‌గ‌న్ వెంట తిరిగిన వారు.. ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఇక‌, ఇప్పుడు ఉన్న వారు కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. జ‌గ‌న్‌ను న‌మ్ముకున్నాం.. అయితే.. త‌మ‌ను ఏం చేస్తారో.. ఏమో.. అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఇబ్బంది ఖాయ‌మ‌ని అంటున్నారు. న‌మ్మ‌కం అనే పునాదుల‌పైనే జ‌గ‌న్ చుట్టూ నాయ‌కులు చేరారు. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి.. మ‌రీ చేర‌డం వెనుక ఉన్న ప్ర‌ధాన కార‌ణం కూడా ఇదే.

అయితే.. జ‌గ‌న్ ఇప్పుడు ఇదే విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. త‌న‌ను న‌మ్ముకున్న వారిని ఆయ‌న ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని.. నాయ‌కులు వాపోతున్నారు. ఇలా అయితే.. క‌ష్ట‌మ‌నే భావ‌న కూడా వ్యక్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్‌ను బ‌ల‌ప‌రిచేందుకు నాయ‌కులు ఎవ‌రూ ముందుకు రాక‌పోతే.. ఎలా? కేవ‌లం కొత్త‌వారినే గెలిపించుకోగ‌ల‌ను అనే భావ‌న కూడా స‌రైందేనా? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ఊపందుకోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. జ‌గ‌న్ అడుగులు వైసీపీలో అభ‌ద్ర‌త‌ను పెంచుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on July 10, 2022 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

3 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

7 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

8 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

11 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

12 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

13 hours ago