Political News

జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త త‌గ్గుతోందా…!

వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై పార్టీలో విశ్వ‌స‌నీయ‌త‌, న‌మ్మ‌కం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయన పేరుతో ఆయ‌న ఫొటోతోనే నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈ న‌మ్మ‌కం ఇప్పుడు స‌డులుతోంద‌నే భావన రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. కుటుంబం విషయంలో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. చెల్లిని, త‌ల్లిని.. పక్క‌న పెట్టార‌నే వాద‌న ప్ర‌తిప‌క్షం నుంచి వినిపిస్తోంది.

ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌ను జ‌గ‌న్ వాడుకుని వ‌దిలేశార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు.. ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్తున్నాయి. అదేస‌మ‌యంలో నాయ‌కుల మ‌ధ్య కూడా చర్చ‌కు వ‌స్తున్నాయి. ఇవి నైతికంగా .. జ‌గన్ విశ్వ‌స‌నీయ‌త‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఇదే ప‌రిస్థితి ఉంటే.. జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయం పెరుగుతోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ వెంట తిరిగిన వారు కూడా.. ఇప్పుడు ఇదే ఆలోచ‌న‌లో ఉన్నారు.

ముఖ్యంగా గ‌తంలో జ‌గ‌న్ వెంట తిరిగిన వారు.. ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఇక‌, ఇప్పుడు ఉన్న వారు కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. జ‌గ‌న్‌ను న‌మ్ముకున్నాం.. అయితే.. త‌మ‌ను ఏం చేస్తారో.. ఏమో.. అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఇబ్బంది ఖాయ‌మ‌ని అంటున్నారు. న‌మ్మ‌కం అనే పునాదుల‌పైనే జ‌గ‌న్ చుట్టూ నాయ‌కులు చేరారు. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి.. మ‌రీ చేర‌డం వెనుక ఉన్న ప్ర‌ధాన కార‌ణం కూడా ఇదే.

అయితే.. జ‌గ‌న్ ఇప్పుడు ఇదే విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. త‌న‌ను న‌మ్ముకున్న వారిని ఆయ‌న ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని.. నాయ‌కులు వాపోతున్నారు. ఇలా అయితే.. క‌ష్ట‌మ‌నే భావ‌న కూడా వ్యక్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్‌ను బ‌ల‌ప‌రిచేందుకు నాయ‌కులు ఎవ‌రూ ముందుకు రాక‌పోతే.. ఎలా? కేవ‌లం కొత్త‌వారినే గెలిపించుకోగ‌ల‌ను అనే భావ‌న కూడా స‌రైందేనా? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ఊపందుకోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. జ‌గ‌న్ అడుగులు వైసీపీలో అభ‌ద్ర‌త‌ను పెంచుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on July 10, 2022 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

44 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago