Political News

వైసీపీ ‘బూతుల ప్లీన‌రీ’ : జ‌న‌సేన ఫైర్

అధికార వైసీపీ నిర్వహించిన రెండు రోజుల ప్లీనరీ సమావేశాలు.. సర్కస్ కంపెనీని తలపించాయని జనసేన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం గురించి మాట్లాడకుండా.. వైసీపీ నేతలు ఒకరినొకరు సింహాలు, పులులు అంటూ మాట్లాడుకున్నారని విమర్శించారు. రెండు రోజుల ప్లీనరీ సమావేశాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ పంచ్లు వేశారు. ప్లీనరీ సమావేశాలు సర్కస్ కంపెనీని తలపించాయని ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగానికి ఈ ప్లీనరీ పరాకాష్ట అని మండిపడ్డారు.

పెద్ద పెద్ద గుడారాలు‌ వేసి.. సర్కస్ నిర్వహించిన విధంగా ప్లీనరీ నిర్వహించారని విమర్శించారు. సీఎం జగన్.. క్రెడిబిలిటీ గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. ప్లీనరీలో ఎంత మంది పద్దతిగా మాట్లాడారో చెప్పాలన్నారు. బూతులతో నోరు పారేసుకోవడానికి అంత ఖర్చు ప్లీనరీ నిర్వహించాలా? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్ నిజంగా 95 శాతం హామీలు అమలు చేస్తే.. ఏప్రిల్ లో ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. గడపగడప కూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం జగన్ వైసీపీ ప్రజా ప్రతినిధులను బతిమాలుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో జనసేన రెండో‌ విడత “జనవాణి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.

కొడాలి నానికి ఎదురుదెబ్బ

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న పాలంకి బ్రదర్స్ సారధిబాబు, మోహన్ బాబు జనసేన పార్టీలో చేరారు. రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తాము 2019 నుండి వైసీపీలో కొనసాగుతున్నామని పోలంకి సారధిబాబు తెలిపారు. గత ఎన్నికల్లో కొడాలి నానితో కలిసి వైసీపీ విజయానికి పని‌ చేశామని చెప్పారు.

అయితే.. ఇటీవలి కాలంలో కొడాలి నాని శృతి మించి మాట్లాడుతున్నారని, పవన్ కళ్యాణ్ పై తరచూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని తాము కోరినా నాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వ్యవహారశైలి నచ్చకనే.. జనసేన పార్టీలో చేరినట్టు చెప్పారు.

This post was last modified on July 10, 2022 7:36 am

Share
Show comments
Published by
satya

Recent Posts

చంద్ర‌బాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు…

29 seconds ago

ఏపీ డీజీపీ బ‌దిలీ : ఈసీ యాక్ష‌న్‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణల నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మంది…

12 mins ago

కుటుంబాల్లో పొలిటిక‌ల్‌ క‌ల్లోలం!

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 13న అంటే వ‌చ్చే సోమ‌వారం.. ఎన్నిక‌ల…

1 hour ago

ఇండియన్-2 ఫిక్స్.. గేమ్‌చేంజర్‌కు భయం లేదు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…

2 hours ago

జ‌గ‌న్ రాముడిని అవ‌మానించాడు.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు.…

4 hours ago

పుష్ప గొంతు విప్పాడు

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…

5 hours ago