అధికార వైసీపీ నిర్వహించిన రెండు రోజుల ప్లీనరీ సమావేశాలు.. సర్కస్ కంపెనీని తలపించాయని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం గురించి మాట్లాడకుండా.. వైసీపీ నేతలు ఒకరినొకరు సింహాలు, పులులు అంటూ మాట్లాడుకున్నారని విమర్శించారు. రెండు రోజుల ప్లీనరీ సమావేశాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ పంచ్లు వేశారు. ప్లీనరీ సమావేశాలు సర్కస్ కంపెనీని తలపించాయని ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగానికి ఈ ప్లీనరీ పరాకాష్ట అని మండిపడ్డారు.
పెద్ద పెద్ద గుడారాలు వేసి.. సర్కస్ నిర్వహించిన విధంగా ప్లీనరీ నిర్వహించారని విమర్శించారు. సీఎం జగన్.. క్రెడిబిలిటీ గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. ప్లీనరీలో ఎంత మంది పద్దతిగా మాట్లాడారో చెప్పాలన్నారు. బూతులతో నోరు పారేసుకోవడానికి అంత ఖర్చు ప్లీనరీ నిర్వహించాలా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్ నిజంగా 95 శాతం హామీలు అమలు చేస్తే.. ఏప్రిల్ లో ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. గడపగడప కూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం జగన్ వైసీపీ ప్రజా ప్రతినిధులను బతిమాలుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో జనసేన రెండో విడత “జనవాణి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.
కొడాలి నానికి ఎదురుదెబ్బ
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న పాలంకి బ్రదర్స్ సారధిబాబు, మోహన్ బాబు జనసేన పార్టీలో చేరారు. రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తాము 2019 నుండి వైసీపీలో కొనసాగుతున్నామని పోలంకి సారధిబాబు తెలిపారు. గత ఎన్నికల్లో కొడాలి నానితో కలిసి వైసీపీ విజయానికి పని చేశామని చెప్పారు.
అయితే.. ఇటీవలి కాలంలో కొడాలి నాని శృతి మించి మాట్లాడుతున్నారని, పవన్ కళ్యాణ్ పై తరచూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని తాము కోరినా నాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వ్యవహారశైలి నచ్చకనే.. జనసేన పార్టీలో చేరినట్టు చెప్పారు.
This post was last modified on July 10, 2022 7:36 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…