Political News

వైసీపీ ప్లీన‌రీలో చంద్ర‌బాబు జ‌పం.. వైఎస్‌ను మించి మ‌రీ..!

వైసీపీ నిర్వ‌హించిన ప్లీన‌రీలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ ప్లీన‌రీని వాస్త‌వానికి జ‌గ‌న్ తండ్రి, దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించారు. అయితే.. దీనిలో ఆయ‌న పేరు క‌న్నా.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌పంతోనే వైసీపీ నాయ‌కులు త‌రించార‌నే కామెంట్లు వ‌స్తున్నాయి. రెండో రోజు జ‌రిగిన ప్లీన‌రీలో ఏకంగా 100 సార్ల‌కు పైగా చంద్ర‌బాబుపేరును త‌లుచుకోగా.. కేవ‌లం ప‌ది 15 సార్లు మాత్ర‌మే వైఎస్ పేరును స్మ‌రించ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్లీన‌రీ అంతా.. ఎవ‌రి నోట విన్నా.. చంద్ర‌బాబు పేరే వినిపించ‌డం గ‌మ‌నార్హం.

అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ‘ప్లీనరీ’ నిర్వహించింది. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఇంకోవైపు టీడీపీ మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలు విజయవంతమైన నేపథ్యంలో… ఒకవిధమైన ఒత్తిడితో కూడిన వాతావరణంలో వైసీపీ ప్లీనరీ ముగిసింది. ఈ ప్లీనరీలో జగన్‌తోపాటు వైసీపీ నేతలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు సమావేశాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ప్లీనరీలో సీఎం జగన్ ఆక్రోశంతో ఊగిపోయారు.

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు వైసీపీ నేతలు మీడియా, ప్రతిపక్ష నేతలపై పడ్డారు. ప్లీనరీ ఉద్దేశం, పార్టీ విస్తరణ, ప్లీనరీ తీర్మానాలు ఇవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబుపై విషాన్ని కక్కారు. ఒకటి రెండు కాదు ఏకంగా వంద సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించారు. దీన్నిబట్టి వైసీపీ నేతలు ఎంత ప్రస్టేషన్‌లో ఉన్నారో అర్థమవుతోందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. రెండు రోజుల వైసీపీ ప్లీనరీలో చంద్రబాబు పేరును 100 సార్లకన్నా ఎక్కువ‌గానే వైసీపీ నేతలు పలికారు. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుపేరు 80 సార్లు, ABN రాధాకృష్ణ పేరు 70 సార్లు ప్రస్తావించారు.

TV5 నాయుడి పేరు 60 సార్లు, దుష్టచతుష్టయం పేరు 50 సార్లును వైపీసీ నేతల నోట వినిపించాయి. దత్తపుత్రుడు(ప‌వ‌న్‌) పేరు 40 సార్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ABN, TV5 పేర్లు(క‌లిపి) 30 సార్లు ప్రస్తావించారు. టీడీపీ నేత లోకేష్ పేరు 20 సార్లు పలికారు. వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తండ్రి వైఎస్‌ఆర్‌ పేరుని కేవలం 10 సార్లు మాత్రమే నేతలు ప్రస్తావించారు. పార్టీ దిశానిర్దేశం, కార్యచరణపై చర్చించాల్సిన ఈ ప్లీనరీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పేరుని ఏకంగా 100 సార్లు పలకడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు పేరుని పలికిన తీరుని బట్టి వైసీపీ నేతల తీరును అర్ధం చేసుకోవచ్చునని చెబుతున్నారు.

This post was last modified on July 9, 2022 10:09 pm

Share
Show comments

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

48 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

1 hour ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago