Political News

చంద్రబాబు కన్నా తక్కువ అప్పులే చేశా: జగన్

ఏపీ సీఎం జగన్ తాను ప్రవేశపెట్టిన నవ రత్నాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న ప్లీనరీ వేదికగా తాను చేస్తున్న అప్పులపై జగన్ స్పందించారు. చంద్రబాబుతో పోలిస్తే తాను చేస్తున్న అప్పులు తక్కువేనని జగన్ స్పష్టం చేశారు.

గతంలో కూడా దాదాపుగా ఇదే బడ్జెట్ అని, అప్పుడు చంద్రబాబు సీఎం అని, ఇప్పుడు కూడా ఇదే బడ్జెట్ అని…సీఎం జగన్ అని చెప్పారు. అప్పుల విషయానికి వస్తే చంద్రబాబే జగన్ కన్నా ఎక్కువ అప్పులు చేశారని చెప్పారు. అప్పుడు వాళ్లెందుకు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయారు..ఇప్పుడు జగన్ ఎలా చేయగలుగుతున్నాడు అని జగన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఒక బటన్ నొక్కితే చాలని, నేరుగా అక్కచెల్లెమ్మలు, అన్నల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు.

ఎక్కడా లంచాలు లేవు..ఎక్కడా వివక్ష లేదు..అందుకే పథకాలు అమలు చేయగలుగుతున్నానని అన్నారు. చంద్రబాబు హయాంలో బటన్లు లేవు..నొక్కేది లేదు…నేరుగా దోచుకో…పంచుకో..అని ఎద్దేవా చేశారు. ఇంత ఈనాడు, అంత ఏబీఎన్, మరికొంత టీవీ5, ఇంకొంత దత్తపుత్రుడు, మిగిలింది చంద్రబాబుకు…అందుకే పథకాలు తనలా అమలు చేయలేదని, గజదొంగల ముఠాకు మంచి పాలనకు మధ్య తేడాను గమనించాలని కోరారు.

వైసీపీ నేతలంతా జనం ఇంట ఉన్నారని, జనం గుండెల్లో ఉన్నారని, గజదొంగల ముఠా మాత్రం ఎల్లో టీవీలలో, ఎల్లో పేపర్లలో, ఎల్లో సోషల్‌ మీడియాలో మాత్రమే ఉందని చెప్పారు. వారికి తమకు పోలిక లేదని, తమ చేతల పాలనకు, వారి చేతగాని పాలనకూ మధ్య పోటీ లేదని అన్నారు. మన నిజాలకు వారి అబద్దాలకు మధ్య పోటీనా ? మన నిజాయితీకి వారి వంచనకు మధ్య పోటీనా? అని ప్రశ్నించారు. పచ్చి అబద్దాలతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

This post was last modified on July 9, 2022 9:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

8 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

9 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

11 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

12 hours ago