Political News

వైసీపీకి విజ‌య‌మ్మ గుడ్‌బై.. ష‌ర్మిల‌తోనే ప్ర‌యాణం!

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉన్న విజ‌య‌మ్మ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీలో త‌న ప‌ద‌వికి ఆమె రాజీనామా స‌మ‌ర్పిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక నుంచి తాను తెలంగాణ‌లో త‌న బిడ్డ ష‌ర్మిల పార్టీకి ప‌నిచేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. గుంటూరులో ఈ రోజు ఉద‌యం ప్రారంభ‌మైన వైసీపీ ప్లీన‌రీ వేదిక‌గా.. మాట్లాడిన ఆమె త‌న గౌర‌వ అధ్య‌క్షురాలి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే త‌న రాజీనామాపై కొన్ని ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌చ్చాయ‌ని.. వాటిని తాను చ‌దివాన‌ని.. అయితే.. వారు అనుకుంటున్న‌ట్టుగా తాను విభేదాలు వ‌చ్చి రాజీనామా చేయ‌డం లేద‌ని.. ఆమె వ్యాఖ్యానించారు. ఇక నుంచి తాను ష‌ర్మిల పార్టీకి ప‌నిచేయ‌నున్న నేప‌థ్యంలో ఎలాంటి విమ‌ర్శ‌లు, వ‌క్రీక‌ర‌ణ‌ల‌కు తావివ్వ‌రాద‌నే ఉద్దేశంతోనే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని తెలిపారు. త‌న కుమార్తె ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీపెట్టార‌ని.. త‌న అవ‌స‌రం అక్క‌డ ఎంతో ఉంద‌ని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో.. ఏపీలోను, తెలంగాణ‌లోనూ తాను పార్టీల‌కు ప‌నిచేయ‌డం స‌రికాద‌ని విజ‌య‌మ్మ పేర్కొన్నారు. అందుకే అనుకోని ప‌రిస్థితిలో రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ఈ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని తాను ఊహించ‌లేద‌ని విజ‌య‌మ్మ అన్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ‌డ్డ‌లు ఇప్పుడు ప్ర‌జ‌ల ముందు ఉన్నార‌ని.. ప్ర‌జ‌ల కోసం సేవ చేసేందుకు వచ్చార‌ని ఆమె తెలిపారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని వైఎస్‌ విజయమ్మ అన్నారు.

త‌మ కుటుంబంపై గ‌త కాంగ్రెస్ పాల‌కులు అన్యాయంగా కేసులు పెట్టి వేధించారని, అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదని తెలిపారు. జగన్‌ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైఎస్‌ విజయమ్మ చెప్పారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాలు తెచ్చారని వైఎస్‌ విజయమ్మ అన్నారు.

Satya

Recent Posts

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

15 minutes ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

32 minutes ago

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

2 hours ago

స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శలో ఎందుకీ రచ్చ?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…

3 hours ago

వంద దేవుళ్ళు కలిసి హిట్ ఇస్తారా

వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…

3 hours ago

టాక్సిక్ చుట్టూ వలయం బిగుస్తోంది

అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…

4 hours ago