Political News

చింత‌మ‌నేని ఆగ్ర‌హం ఎవ‌రిమీద‌!?

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్‌.. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను పేకాట శిబిరానికి వెళ్ల‌క పోయిన‌ప్ప‌టికీ.. త‌న పేరు ఉంద‌నే ప్ర‌చారం చేయ‌డం.. పోలీసు రైడ్ తర్వాత పారిపోయినట్లు వచ్చిన పుకార్లపై ఆయ‌న ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయన చేసిన కామెంట్లు.. ఎవ‌రికీ అర్ధం కాలేదని అంటున్నారు. ఎందుకంటే.. ఆయ‌న త‌న కామెంట్లలో ఎవ‌రిని ఆక్షేపించారు. ఎవ‌రిని తిట్టిపోశారు..? అనేదానిపై చ‌ర్చ సాగుతోంది.

అస‌లు ఏం జ‌రిగిందంటే.. హైద‌రాబాద్ శివారు ప్రాంతంలోని ప‌టానుచెరు మండ‌లం చిన‌కంజ‌ర్ల శివారు లో ఉన్న మామిడితోట‌లో కోడి పందేలు నిర్వ‌హిస్తున్నారనే ప‌క్కా స‌మాచారంతో పోలీసులు రంగంలోకిదిగి దాడి చేశారు. అయితే.. అప్ప‌టికే.. చింత‌మ‌నేనితో పాటు మ‌రికొంద‌రు ప‌రార‌య్యార‌ని డీఎస్పీ భీం రెడ్డి తెలిపారు. అక్కడ 70 మంది ఉన్నార‌ని, వీరిలో 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

పట్టుకున్న వారి నుంచి రూ.13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్ ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అయితే.. ఇదే సమయంలో ఏపీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని కూడా పాల్గొన్నారని, పోలీసుల దాడి నేపథ్యంలో ఆయన పారిపోయారని తెలిపారు. ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నట్లు వెల్ల‌డించారు. ఇక‌, ఈ స‌మాచారంతో మీడియా రంగంలోకి దిగి.. దీనిపై ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చారం చేసింది.

ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ అనుకూల మీడియా సాక్షి మరింత దూకుడుగా ముందుకు వెళ్లింది. చింతమ‌నేనికి వ్య‌తిరేకంగా.. వ‌రుస క‌థ‌నాలు ప్ర‌సారం చేసింది. దీనిపై ఫేస్ బుక్ వేదిక‌గా చింత‌మ‌నేని ఫైర్ అయ్యారు. “కోడి పందాల్లో లేని వ్యక్తి నీ ఉన్నట్లు గానే చూపటం మీ జెండా అజెండా.. ఇంత రాక్షస రాజకీయం అవసరమా…?” అని చింతమనేని ఫేస్ బుక్ లో ప్రశ్నించారు.

రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొనండి. ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైన ఆపండి. అని కోరారు. ఈ నీచమైన ప్రచారంతో.. కుప్ప కూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు, తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారంలోకి వచ్చారు. ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమైంద‌ని అన్నారు. మీ అసత్యాల సాక్షి ని ప్రజలు కూకటి వేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైందన్నారు. ఆ రోజు కొసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు.

మీ రాక్షస రాజకీయ వికటాట్టహాసానికి ముగింపు త్వరలో నే. మీ చింతమనేని ప్రభాకర్ అంటూ తన ఫేస్ బుక్ పోస్టులో రాసుకొచ్చారు. అయితే.. చింత‌మ‌నేని ఆగ్ర‌హం ఎవ‌రిపైన‌? అనేది సందేహంగా మారింది. ఎందుకంటే.. ఘ‌ట‌న జ‌రిగింది..తెలంగాణ‌లో.. కాబ‌ట్టి.. అక్క‌డి ప్ర‌భుత్వంపై ఆయ‌న కామెంట్లు చేశారా? లేక‌.. దీనిని ప్ర‌చారం చేసింది.. సాక్షి కాబ‌ట్టి.. ఈ ప‌త్రికను.. ఏపీ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టారా? అనేది సందేహంలో ప‌డింది. మ‌రి దీనిపై టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on July 8, 2022 7:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

9 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

10 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

10 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

12 hours ago