Political News

చంద్రబాబును అసెంబ్లీ ఏమి చేయబోతోంది ?

డేటా చోరీలో చంద్రబాబునాయుడే కీలక సూత్రదారిగా సభాసంఘం తేల్చేసింది. చంద్రబాబు, అప్పటి ఐటి శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ ఆదేశాల ప్రకారమే కిందస్ధాయి ఉద్యోగులు, కొందరు బయటవ్యక్తులు గోప్యంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినేట్లు సభాసంఘానికి నాయకత్వం వహిస్తున్న తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. తాము లోతైన విచారణ జరిపిన తర్వాత చంద్రబాబు, లోకేష్ పాత్రకు ఆధారాలు దొరికినట్లు చెప్పారు.

తొందరలోనే తమ నివేదికను అసెంబ్లీకి అందించనున్నట్లు కూడా చెప్పారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసి మరింత లోతైన దర్యాప్తు చేయాల్సుంటందని భూమన అభిప్రాయపడ్డారు. అంతా బాగానే ఉందికాని సభాసంఘం విచారణలో చంద్రబాబే దోషని తేల్చారు సరే. మరిపుడు చంద్రబాబును ఏమి చేయబోతున్నారు ? ఏమి చేయగలరు ? అన్నదే కీలకమైన పాయింట్. సభా సంఘం చంద్రబాబును తప్పుపట్టినంత మాత్రాన ఏమైపోతుంది ? గతంలో రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రుల కమిటి తేల్చింది.

అప్పట్లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ కు చంద్రబాబే సూత్రదారని కూడా మంత్రుల కమిటి నిర్ధారించింది. చంద్రబాబు పాత్ర విషయంలో అన్నీ ఆధారాలున్నాయని కూడా మంత్రులు చెప్పారు. తీరా యాక్షన్ తీసుకునే సమయంలో ఏమి జరిగింది ? కమిటి ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు కోర్టుకెళ్ళారు. కేసు విచారణలో ఇన్ సైడర్ ట్రేడింగే జరగలేదని కోర్టు తేల్చేసింది. రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్న పద్దతే వర్తించదని కూడా చెప్పింది. ఏ విషయంలో తీసుకున్నా చంద్రబాబును ఏదో చేద్దామని ప్రభుత్వం ప్రయత్నించటం చివరకు అభాసుపాలవ్వటమే జరుగుతోంది. కాబట్టి చంద్రబాబును ఏదో చేద్దామన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంటే మంచిది. ఎందుకంటే చంద్రబాబును ఈ ప్రభుత్వం ఏమీ చేయలేందన్న విషయం జనాలకు కూడా బాగా తెలిసిపోయింది. కాబట్టి ఈ సభాసంఘాలు, విచారణ, ప్రకటనలన్నీ కేవలం మీడియాలో హడావుడి చేయటానికి మాత్రమే పనికొస్తాయి.

This post was last modified on July 7, 2022 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

4 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

5 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

5 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

7 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

7 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

9 hours ago