వివాదాస్పద వ్యక్తుల్లో ఒకడైన మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలీసులు దాడులు చేస్తున్నారని తెలుసుకుని పారిపోయారు. ఇంతకీ చింతమనేని ఎందుకు పారిపోయారు ? పోలీసులు ఎందుకు దాడులుచేశారు ? ఎందుకంటే కోడిపందేల్లో పాల్గొంటున్న వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు దాడులు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంఎల్ఏతో పాటు మరికొందరు పరారైపోయారు.
ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ శివార్లలోని చినకంజర్లలో మామిడి తోటలున్నాయి. ఈ తోటల్లో జనాల సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో అనుమానం వచ్చిన స్ధానికులు ఆరాతీశారు. చూస్తే తోటల్లో భారీఎత్తున కోళ్ళపందేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కొందరు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో బుధవారం రాత్రి పోలీసులు ఒక్కసారిగా దాడులుచేశారు. అయితే చివరి నిముషంలో దాడుల విషయాన్ని గ్రహించిన కొందరు అక్కడినుండి పారిపోయారు.
పారిపోయిన వారిలో దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ తో పాటు అక్కినేని కృష్ణంరాజు అండ్ కో పరారయ్యారు. చింతమనేని, కృష్ణంరాజు, అక్కినేని సతీష్, శ్రీనులు తమ బృందాలతో పెద్దఎత్తున కోళ్ళపందేలు నిర్వహిస్తున్నారు. దాడుల్లో 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో పాటు భారీగా డబ్బులు, సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏపీలోని వివాదాస్పద వ్యక్తుల్లో చింతమనేని ముందు వరసలో ఉంటారు. పశ్చిమగోదావరి జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోళ్ళపందేల్లో కూడా చింతమనేని యాక్టివ్ గా పాల్గొంటారు. నిజానికి కోళ్ళపందేలను హైకోర్టు నిషేధించినా ఆచరణలో సాధ్యం కావటంలేదు. మిగిలిన విషయాల్లో రాజకీయపార్టీల నేతల మధ్య విభేదాలు ఎలాగున్నా కోడిపందేల నిర్వహణలో మాత్రం అందరు ఏకమైపోతారు. అందుకనే కోళ్ళపందేలు జరగకుండా పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇపుడు రాష్ట్రందాటి పక్కరాష్ట్రంలో ఆడుతున్నందుకే చింతమనేని బుక్కయ్యారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…