Political News

కొత్త వివాదంలో రఘురామరాజు

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. తాజాగా గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఎంపీతో పాటు ఆయన కొడుకు, పీఏ, భద్రతా సిబ్బందిపై కేసులు నమోదయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ ను అనుమానాస్పద వ్యక్తిగా అనుమానించి ఎంపీకి భద్రతగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది కొట్టారట. ఎంపీ ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.

తాను ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా ఐఎస్బీ దగ్గర డ్యూటీ లో ఉన్నట్లు చెప్పాడు. అయినా వినకుండా అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని ఎంపీ ఇంటికి తీసుకెళ్ళారట. అక్కడ ఎంపీ సమక్షంలోనే ఆయన కొడుకు భరత్, ఏపీ శాస్త్రి, భద్రతా సిబ్బంది చావకొట్టారట. తన ఐడెంటి కార్డు చూపించినా ఎంపీ ఇంట్లో తనను కొట్టారంటు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదుచేశారు. తనింట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే తమపైనే ఎదురు కేసులు పెట్టినట్లు ఎంపీ ఆరోపిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎంపీ ఇంటి ముందు ఎవరు ఉండకూడదా అనే సందేహం వస్తోంది. అనుమానముంటే వాళ్ళెవరో భద్రతాసిబ్బంది ఆరా తీయవచ్చు. వాళ్ళు చెప్పింది నిర్ధారణ చేసుకోవచ్చు. అంతేకానీ వాళ్ళని పట్టుకుని కొట్టడం ఏమిటో అర్ధం కావటం లేదు. ఇక్కడ కానిస్టేబుల్ తన ఐడెంటిటినీ చూపించినా పట్టించుకోకుండా ఇంట్లోకి తీసుకెళ్ళి కొట్టారంటున్నారు. బలవంతంగా కారులోకి ఎక్కిస్తున్న, గార్డెన్లో కానిస్టేబుల్ ను కొడుతున్న వీడియో దృశ్యాలు అందరు చూశారు. ఇపుడు ఎంపీ ఇంట్లో జరిగిందానికి, అప్పట్లో సీఐడీ విచారణ పేరుతో తనను కొట్టారని ఎంపీ ఆరోపిస్తున్న దానికి తేడా ఏముంది ?

అప్పట్లో తనను సీఐడీ పోలీసులు ఎలాగైతే కారులో బలవంతంగా తీసుకెళ్ళి విచారణ పేరుతో కొట్టారని ఎంపీ చెబుతున్నారో ఇపుడు కానిస్టేబుల్ ను తన సిబ్బందితో అలాగే ఇంటికి పిలిపించుకుని కొట్టించినట్లున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని ఎంపీ ఒక మామూలు కానిస్టేబుల్ పైన చూపించినట్లు అర్ధమవుతోంది.

This post was last modified on July 6, 2022 2:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

2 hours ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

5 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

6 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

7 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

8 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

9 hours ago