సాధారణంగా.. విపక్షంలో ఉన్న నాయకులు.. తమ తమ నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదంటూ.. నిరసన వ్యక్తం చేస్తారు. లేదా.. తమకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ.. ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇది .. కామన్ కూడా! ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా.. సహజంగానే ప్రతిపక్షానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ.. అదేం చిత్రమో కానీ.. వైసీపీ సర్కారులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా రోడ్డున పడుతున్నారు. తమకు రూపాయి కూడా ఇవ్వడం లేదని.. కనీసం.. నియోజకవర్గాల్లో పనులు కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వరుసలో.. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే.. సీనియర్ నాయకుడు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తమకు నిధులు ఇవ్వడం లేదని.. ప్రజలు తమను నిలదీస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రజలకు చిన్న చిన్న పనులు కూడా చేయలేక పోతున్నామన్నారు. ఈ క్రమంలో స్థానిక ఉమారెడ్డి గుంటలో శ్రీధర్రెడ్డి నిరసనకు దిగారు.
డ్రైనేజీపై వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాలువలోకి దిగి నిరసన తెలిపారు. ఈ క్రమంలో మరోసారి కాలువలో దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి.. రైల్వే, నగర కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు
ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఎప్పటిలోగా పనుల ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని.. అంతవరకు కాలువ వద్ద నుంచి కదలబోనని స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే డ్రైనేజీలోనే పడుకుంటానని హెచ్చరించారు. దీంతో అధికారులు ఈ నెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15లోపు పూర్తి చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి తన నిరసనను విరమించారు.
This post was last modified on July 5, 2022 4:30 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…