కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా ఆశలు పెట్టుకున్నట్లే ఉన్నారు. మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ విస్తరణపై చేసిన తీర్మానంలో షా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఇంతవరకు ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ తర్వాత చేసిన వ్యాఖ్యలే అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏమిటంటే ఏపీ, తమిళనాడు, కేరళలో కూడా తొందరలోనే అధికారంలోకి వచ్చేస్తారట. నిజానికి తెలంగాణాలో అధికారంలోకి వచ్చేదే అనుమానం. ఎందుకంటే వచ్చే ఎన్నికల విషయంలో తెలంగాణాలో కమలనాథులు నానా గోల చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పార్టీకి అంత సీన్ లేదని అందరికీ తెలిసిందే. గెలుపు సంగతి పక్కన పెట్టేస్తే 119 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల గట్టి అభ్యర్ధులను పోటీ పెట్టేంత సీన్ కూడా పార్టీకి లేదు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మహా అయితే 40 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు గట్టి అభ్యర్ధులు దొరికితే అదే చాలా ఎక్కువ. పోటీకే అభ్యర్ధులు దొరకని పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందని చెబితే ఎవరు నమ్ముతారు ? సరే రాజకీయపార్టీలన్నాక ఇలాగే చెప్పాలని అనుకున్నా చెప్పుకునేదేదో కాస్త రియాలిటీకి దగ్గరలో ఉంటే బాగుంటుంది.
ఎంతో కొంత బలముందని చెప్పుకునే తెలంగాణాలోనే పార్టీ పరిస్దితి ఇలాగుంటే అసలు ఏమాత్రం బలంలేని ఏపీ, తమిళనాడు, కేరళలో తొందరలో అధికారంలోకి వచ్చేయబోతున్నట్లు అమిత్ షా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఏపిలో అయితే 2019 ఎన్నికల్లో గానీ తర్వాత జరిగిన మూడు ఉపఎన్నికల్లో కానీ బీజేపీ అభ్యర్ధులకు ఏ నియోజకవర్గంలో కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని అందరికీ తెలిసిందే. ఏపీకి నరేంద్ర మోడీ సర్కార్ అన్యాయం చేస్తున్నంత కాలం పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుందనటంలో సందేహం లేదు. ఇలాంటిది ఇక తమిళనాడు, కేరళ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.
This post was last modified on July 4, 2022 11:16 am
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…