Political News

AP : కార్య‌క‌ర్త‌ల‌కూ కానుకలు… ఏ రూపంలో ?

ఇప్ప‌టిదాకా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై మండిప‌డుతున్న కార్య‌క‌ర్త‌ల‌ను కూల్ చేసేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌న్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. మొన్న‌టి ఉమ్మ‌డి క‌ర్నూలు కేంద్రంగా జ‌రిగిన ప్లీన‌రీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కార్య‌క‌ర్త‌ల‌ను ఆదుకునేందుకు అధినాయ‌క‌త్వం సిద్ధంగానే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడిదే అంత‌టా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌నులు చేప‌ట్టి బిల్లులు రాక అవ‌స్థలు ప‌డుతున్న వారికి ఇదొక ఊర‌ట కానుంది. మ‌రి! వాళ్ల‌ను ఏ విధంగా ఆదుకుంటారు.. ఏ మేర‌కు నిధులు ఇస్తారు ? అన్న వాటిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కార్య‌క‌ర్త‌ల‌కే కాదు ఎమ్మెల్యేల‌కూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప‌నుల‌కు ఒక్కొక్క‌రికి 12 కోట్లు మంజూరుకు సీఎం నిర్ణ‌యించారు. ముందు రెండు కోట్లు విడుద‌ల చేసి, ప‌నులు చేప‌ట్టాక అటుపై మిగిలిన నిధులు కేటాయించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అంటే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మన ప్ర‌భుత్వం పేరిట గుర్తించిన స‌మ‌స్య‌ల‌పైనే దృష్టి సారించి, తొలుత కేటాయించిన నిధుల‌ను వాడుకుని, సంబంధిత ప‌నుల‌ను నాణ్య‌త‌తో చేయించి త‌న‌కు నివేదించాల‌ని, దీర్ఘ కాలిక స‌మ‌స్య‌ల గుర్తింపున‌కు, ప‌రిష్కారానికి త‌గు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

ఇక తాజాగా విడుద‌ల‌య్యే నిధుల‌తో కార్య‌క‌ర్త‌ల‌కు ప‌నులు అప్ప‌గించేందుకు ఎమ్మెల్యేలు సుముఖంగానే ఉన్నారు. అయితే బిల్లుల క్లియ‌రెన్స్ కు త‌గు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సంబంధిత కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు. ఒక‌వేళ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి పేరిట నిధులు కేటాయించి సంబంధిత ప‌నులు అప్ప‌గిస్తే చేస్తామ‌ని కానీ ఏళ్ల‌కు ఏళ్లు బిల్లులు పెండింగ్ పెడ‌తామంటే చేయ‌లేమ‌ని తేల్చేస్తున్నారు.

మ‌రోవైపు మంత్రులు కూడా పెండింగ్ బిల్లుల క్లియ‌రెన్స్ కోసం ముఖ్య‌మంత్రిపై ఒత్తిడి పెంచేందుకు చూస్తున్నారు. మ‌రోవైపు రెండు రోజుల్లో రెండు వేల కోట్ల రూపాయ‌ల బ‌కాయిల‌ను తీర్చేస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ అంటున్నారు. ఎక్క‌డికి వెళ్లినా బిల్లుల పెండింగ్ విష‌య‌మే చెబుతున్నారు అని, క‌నుక వీటి క్లియ‌రెన్స్ పై దృష్టి సారిస్తామ‌ని అంటున్నారు.

This post was last modified on July 3, 2022 9:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

7 hours ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

8 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

9 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

11 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

11 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

12 hours ago