ఇప్పటిదాకా వలంటీర్ల వ్యవస్థపై మండిపడుతున్న కార్యకర్తలను కూల్ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. మొన్నటి ఉమ్మడి కర్నూలు కేంద్రంగా జరిగిన ప్లీనరీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. కార్యకర్తలను ఆదుకునేందుకు అధినాయకత్వం సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడిదే అంతటా చర్చనీయాంశం అవుతోంది.
ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేపట్టి బిల్లులు రాక అవస్థలు పడుతున్న వారికి ఇదొక ఊరట కానుంది. మరి! వాళ్లను ఏ విధంగా ఆదుకుంటారు.. ఏ మేరకు నిధులు ఇస్తారు ? అన్న వాటిపై ఇంకా స్పష్టత రాలేదు. కార్యకర్తలకే కాదు ఎమ్మెల్యేలకూ బంపర్ ఆఫర్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఒక్కొక్కరికి 12 కోట్లు మంజూరుకు సీఎం నిర్ణయించారు. ముందు రెండు కోట్లు విడుదల చేసి, పనులు చేపట్టాక అటుపై మిగిలిన నిధులు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట గుర్తించిన సమస్యలపైనే దృష్టి సారించి, తొలుత కేటాయించిన నిధులను వాడుకుని, సంబంధిత పనులను నాణ్యతతో చేయించి తనకు నివేదించాలని, దీర్ఘ కాలిక సమస్యల గుర్తింపునకు, పరిష్కారానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇక తాజాగా విడుదలయ్యే నిధులతో కార్యకర్తలకు పనులు అప్పగించేందుకు ఎమ్మెల్యేలు సుముఖంగానే ఉన్నారు. అయితే బిల్లుల క్లియరెన్స్ కు తగు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత కార్యకర్తలు కోరుతున్నారు. ఒకవేళ నియోజకవర్గ అభివృద్ధి పేరిట నిధులు కేటాయించి సంబంధిత పనులు అప్పగిస్తే చేస్తామని కానీ ఏళ్లకు ఏళ్లు బిల్లులు పెండింగ్ పెడతామంటే చేయలేమని తేల్చేస్తున్నారు.
మరోవైపు మంత్రులు కూడా పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచేందుకు చూస్తున్నారు. మరోవైపు రెండు రోజుల్లో రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను తీర్చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అంటున్నారు. ఎక్కడికి వెళ్లినా బిల్లుల పెండింగ్ విషయమే చెబుతున్నారు అని, కనుక వీటి క్లియరెన్స్ పై దృష్టి సారిస్తామని అంటున్నారు.
This post was last modified on July 3, 2022 9:03 pm
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…