ఇప్పటిదాకా వలంటీర్ల వ్యవస్థపై మండిపడుతున్న కార్యకర్తలను కూల్ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. మొన్నటి ఉమ్మడి కర్నూలు కేంద్రంగా జరిగిన ప్లీనరీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. కార్యకర్తలను ఆదుకునేందుకు అధినాయకత్వం సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడిదే అంతటా చర్చనీయాంశం అవుతోంది.
ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేపట్టి బిల్లులు రాక అవస్థలు పడుతున్న వారికి ఇదొక ఊరట కానుంది. మరి! వాళ్లను ఏ విధంగా ఆదుకుంటారు.. ఏ మేరకు నిధులు ఇస్తారు ? అన్న వాటిపై ఇంకా స్పష్టత రాలేదు. కార్యకర్తలకే కాదు ఎమ్మెల్యేలకూ బంపర్ ఆఫర్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఒక్కొక్కరికి 12 కోట్లు మంజూరుకు సీఎం నిర్ణయించారు. ముందు రెండు కోట్లు విడుదల చేసి, పనులు చేపట్టాక అటుపై మిగిలిన నిధులు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట గుర్తించిన సమస్యలపైనే దృష్టి సారించి, తొలుత కేటాయించిన నిధులను వాడుకుని, సంబంధిత పనులను నాణ్యతతో చేయించి తనకు నివేదించాలని, దీర్ఘ కాలిక సమస్యల గుర్తింపునకు, పరిష్కారానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇక తాజాగా విడుదలయ్యే నిధులతో కార్యకర్తలకు పనులు అప్పగించేందుకు ఎమ్మెల్యేలు సుముఖంగానే ఉన్నారు. అయితే బిల్లుల క్లియరెన్స్ కు తగు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత కార్యకర్తలు కోరుతున్నారు. ఒకవేళ నియోజకవర్గ అభివృద్ధి పేరిట నిధులు కేటాయించి సంబంధిత పనులు అప్పగిస్తే చేస్తామని కానీ ఏళ్లకు ఏళ్లు బిల్లులు పెండింగ్ పెడతామంటే చేయలేమని తేల్చేస్తున్నారు.
మరోవైపు మంత్రులు కూడా పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచేందుకు చూస్తున్నారు. మరోవైపు రెండు రోజుల్లో రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను తీర్చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అంటున్నారు. ఎక్కడికి వెళ్లినా బిల్లుల పెండింగ్ విషయమే చెబుతున్నారు అని, కనుక వీటి క్లియరెన్స్ పై దృష్టి సారిస్తామని అంటున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…