Political News

కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదా ?

కాంగ్రెస్ పార్టీ మారుతుందని అనుకోవడం ఉత్త భ్రమలాగే ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం, డిసిప్లిన్ అంతే ఉంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా పార్టీలోని విభేదాలు మరోసారి భగ్గుమని రోడ్డున పడ్డాయి. సిన్హా విమానాశ్రయానికి వచ్చినపుడు కేసీయార్ అండ్ కో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా స్వాగతం పలికారు. ఇదే పార్టీలో విభేదాలు కారణమైంది. యశ్వంత్ కు స్వాగతం పలకటానికి కాంగ్రెస్ నేతలెవరు విమానాశ్రయానికి వెళ్ళకూడదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే నేతలను ఆదేశించారు. అయితే అందుకు విరుద్ధంగా వీహెచ్ ఎయిర్ పోర్టుకెళ్ళి మరీ స్వాగతం పలికారు. రేవంత్ ఎందుకు వద్దన్నారంటే సిన్హాకు స్వాగతం పలికేందుకు కేసీయార్ అండ్ కో వస్తుంది కాబట్టి ఆ సమయంలో అక్కడ తామెందుకనేది రేవంత్ ఉద్దేశ్యం.

సిన్హాతో ప్రత్యేకించి కాంగ్రెస్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రేవంత్ తెలిపారు. ఆ సమావేశంలోనే సిన్హాకు సన్మానం చేయాలని కూడా డిసైడ్ చేశారు. అయితే రేవంత్ ఆదేశాలను వీహెచ్ పట్టించుకోకుండా విమానాశ్రయానికి వెళ్ళటమే ఇపుడు పెద్ద వివాదామైంది. ఈ వివాదంలో రేవంత్ కు మద్దతుగా కొందరు, రేవంత్ ను వ్యతిరేకిస్తు మరికొందరు నేతలు బాహాటంగానే మాటల యుద్ధానికి దిగేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే కాంగ్రెస్ పార్టీలో ఒకరు చెబితే ఇంకొకళ్ళు వినేపద్దతిలేదు. పైగా రేవంత్ వద్దని చెప్పిందాన్ని చేయటానికి కొందరు సీనియర్లు రెడీగా కాచుక్కూర్చునుంటారు. ఇలాంటి వాళ్ళల్లో వీహెచ్ కూడా ఒకరు. అసలే రేవంత్ అంటే కొందరు సీనియర్లకు ఏమాత్రంపడదు. అందుకనే రేవంత్ చెప్పిందానికి కావాలనే వ్యతిరేకం చేస్తారు. ఈ పార్టీలో ఎవరినీ ఎవరు కంట్రోల్ చేసేంత సీన్ లేదుకాబట్టే నేతల్లో క్రమశిక్షణ బ్రహ్మాండంగా కనబడుతుంటుంది.

This post was last modified on July 3, 2022 10:21 am

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

46 minutes ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

49 minutes ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

50 minutes ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

4 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

5 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

6 hours ago