నిజంగా మంత్రిచెప్పినట్లు ప్రత్యేకించి కార్యకర్తలకోసం స్కీం తీసుకొస్తే చాలా గొప్పవిషయమనే చెప్పాలి. కర్నూలులో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి మాట్లాడుతు కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల కోసం పార్టీ ఒక స్కీం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇపుడు బుగ్గన ప్రకటనపైన పార్టీలో విస్తృతంగా చర్చ మొదలైంది. తొందరలోనే ఇలాంటి స్కీం గనుక తీసుకురాగలిగితే పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు మంచిరోజులొచ్చాయనే అనుకోవాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళవుతున్నా సామాన్య కార్యకర్తలను గుర్తించటంలేదనే అసంతృప్తి కార్యకర్తల్లో పెరిగిపోతోంది. రెండు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరచిపోయారనే బాధ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలు బాగా షేర్ చేసుకుంటున్నారు.
దాంతో కార్యకర్తల్లోని అసంతృప్తి జగన్ దృష్టికి వెళ్ళింది. ఇందులో భాగంగానే మొదటి మెట్టుగా అచ్చంగా కార్యకర్తల కోసమే జాబ్ మేళాను ఏర్పాటుచేశారు. ఈ మేళాలో పార్టీకోసం పనిచేస్తున్న వేలాదిమందికి వాళ్ళ అర్హతలకు తట్టట్లుగా కంపెనీల్లో ఉద్యోగాలొచ్చినట్లు ఎంపి విజయసాయిరెడ్డి ప్రకటించారు. అంతాబాగానే ఉందికానీ కిందస్ధాయిలో పనిచేసే, సోషల్ మీడియాలో చొక్కాలు చింపుకుని పనిచేసే కార్యకర్తల మాటేమిటి ? అనే చర్చ మొదలైంది.
ఈ నేపధ్యంలోనే ప్రత్యేకించి ఒక స్కీం విషయంలో జగన్ వర్కవుట్ చేస్తున్నారట. ఇదిగనుక లాంచ్ అయితే మరెంతమందికి లబ్ది జరుగుతుందో తెలీదు. ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఉన్నది రెండేళ్ళు మాత్రమే. ఇపుడు గనుక కార్యకర్తల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో దెబ్బపడుతుందని భయం మొదలైనట్లుంది. అందుకనే బుగ్గన ప్రత్యేకించి స్కీంటు ప్రకటించింది. మరి జగన్ చేస్తున్న కసరత్తు ఏమిటో ? ఎప్పటికి పూర్తవుతుందో ? ఎప్పుడు లాంచ్ అవుతుందో అనేది సస్పెన్స్ గా మారిపోయింది.
This post was last modified on July 2, 2022 2:30 pm
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…