ఒక్కోసారి అంతే.. కొందరు నేతలు గతంలోకి వెళ్లిపోతుంటారు. అలాంటి వేళలో వారి గొంతులో నుంచి వచ్చే ముచ్చట్లు మహా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి విషయాన్నే చెప్పుకొచ్చారు ఏపీ మంత్రి రాజన్న దొర. తాజాగా జిల్లాల స్థాయిలో నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీలో మాట్లాడిన సందర్భంగా.. పార్టీ విషయంలో తనకున్న కమిట్ మెంట్ ను చెప్పుకొచ్చారు.
పార్టీ విషయంలో తానెంత విధేయుడిగా ఉన్నానన్న విషయం మీదనే ఆయన ఫోకస్ చేసినట్లుగా కనిపించింది. ఇందుకు తగ్గట్లే ఆయన తన గురించి చెప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తనను టీడీపీలోకి రావాలని ఒత్తిడి చేశారని.. అందుకు భారీగా తాయిలాలు ఇస్తానని కూడా ఆశ చూపించినట్లు చెప్పారు. పిల్లలకు అయ్యే చదువులతో పాటు రూ.20 కోట్లు.. మంత్రి పదవి.. అమరావతిలో ఇల్లు ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.
అయితే.. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో.. ఆయన మీద ఉన్న అభిమానంతోనే తాను పార్టీ మారలేదని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వేళలో.. జగన్ తొలి మంత్రివర్గంలో తనకు మంత్రి పదవి రానందుకు కూడా తాను బాధ పడలేదని.. పుష్పశ్రీవాణికి అవకాశం ఇచ్చినా ఒక్కమాట అనలేదన్నారు. ఈ కారణంతోనే తనకు మంత్రి పదవి దక్కిందని చెప్పుకున్నారు.
పత్రికల్లోనూ..టీవీల్లోనూ.. సోషల్ మీడియాలోనూ వస్తున్న వార్తల్లో ఏది నిజమన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రజలకు సూచన చేశారు. టీడీపీ ప్రభుత్వ పాలన గురించి ఘాటు వ్యాఖ్యలు చేసిన రాజన్న దొర.. వైసీపీ పాలనను ఆకాశానికి ఎత్తేశారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో టీడీపీ హయాంలో రూ.వేలాది కోట్లు దోచుకున్నారని.. వైసీపీ ప్రభుత్వం మాత్రం రూ.27వేల కోట్లు మాఫీ చేసినట్లుగా పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు కానీ.. చంద్రబాబు అండ్ కో తనకు కట్టిన ధర గురించి రాజన్నదొర బయటకు చెప్పకపోవటం ఏమిటో?
This post was last modified on July 2, 2022 11:53 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…