Political News

చంద్రబాబు రూ.30 కోట్ల ఆఫర్ చేశారు : ఏపీ మంత్రి

ఒక్కోసారి అంతే.. కొందరు నేతలు గతంలోకి వెళ్లిపోతుంటారు. అలాంటి వేళలో వారి గొంతులో నుంచి వచ్చే ముచ్చట్లు మహా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి విషయాన్నే చెప్పుకొచ్చారు ఏపీ మంత్రి రాజన్న దొర. తాజాగా జిల్లాల స్థాయిలో నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీలో మాట్లాడిన సందర్భంగా.. పార్టీ విషయంలో తనకున్న కమిట్ మెంట్ ను చెప్పుకొచ్చారు.

పార్టీ విషయంలో తానెంత విధేయుడిగా ఉన్నానన్న విషయం మీదనే ఆయన ఫోకస్ చేసినట్లుగా కనిపించింది. ఇందుకు తగ్గట్లే ఆయన తన గురించి చెప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తనను టీడీపీలోకి రావాలని ఒత్తిడి చేశారని.. అందుకు భారీగా తాయిలాలు ఇస్తానని కూడా ఆశ చూపించినట్లు చెప్పారు. పిల్లలకు అయ్యే చదువులతో పాటు రూ.20 కోట్లు.. మంత్రి పదవి.. అమరావతిలో ఇల్లు ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.

అయితే.. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో.. ఆయన మీద ఉన్న అభిమానంతోనే తాను పార్టీ మారలేదని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వేళలో.. జగన్ తొలి మంత్రివర్గంలో తనకు మంత్రి పదవి రానందుకు కూడా తాను బాధ పడలేదని.. పుష్పశ్రీవాణికి అవకాశం ఇచ్చినా ఒక్కమాట అనలేదన్నారు. ఈ కారణంతోనే తనకు మంత్రి పదవి దక్కిందని చెప్పుకున్నారు.

పత్రికల్లోనూ..టీవీల్లోనూ.. సోషల్ మీడియాలోనూ వస్తున్న వార్తల్లో ఏది నిజమన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రజలకు సూచన చేశారు. టీడీపీ ప్రభుత్వ పాలన గురించి ఘాటు వ్యాఖ్యలు చేసిన రాజన్న దొర.. వైసీపీ పాలనను ఆకాశానికి ఎత్తేశారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో టీడీపీ హయాంలో రూ.వేలాది కోట్లు దోచుకున్నారని.. వైసీపీ ప్రభుత్వం మాత్రం రూ.27వేల కోట్లు మాఫీ చేసినట్లుగా పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు కానీ.. చంద్రబాబు అండ్ కో తనకు కట్టిన ధర గురించి రాజన్నదొర బయటకు చెప్పకపోవటం ఏమిటో?

This post was last modified on July 2, 2022 11:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

1 hour ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

2 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

3 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

5 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

6 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

6 hours ago