Political News

ఊపందుకున్న అన్నక్యాంటీన్ల.. సెంటిమెంట్‌..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌నిగ‌ట్టిగా నిర్ణయించుకున్న టీడీపీ.. ఆదిశ‌గా అనేక మార్గాల్లో ప‌రుగులు పెడుతోంది. ప్ర‌జ‌లకు చేరువ అయ్యేందుకు పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేసింది. పార్టీ అధినేత చంద్ర‌బాబు.. జిల్లాల యాత్ర‌లు చేస్తున్నారు. అక్టోబ‌రు రెండు నుంచి పార్టీ యువ నాయ‌కుడు.. మాజీ మం త్రి నారా లోకేష్ పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మినీ మ‌హానాడులు నిర్వ‌హించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయితే.. వీటితోపాటు.. ప్ర‌జ‌ల్లో సెంటిమెంటును ర‌గిలించేందుకు కూడాటీడీపీ వ్యూహాత్మ‌కంగా అడుగు లు వేస్తోంది. దీనిలో భాగంగా పేద‌లు, కార్మికుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని .. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని నియోజక వ‌ర్గాల్లోనూ రెండు నుంచి మూడు చోట్ల అన్నాక్యాంటీన్ల‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి నిర్వ‌హిస్తున్నారు. అయితే.. ప్ర‌భుత్వం నుంచి కొన్ని చోట్ల నిర్బంధాలు వ‌చ్చినా.. టీడీపీ మాత్రం ముందుకే సాగుతోంది.

గ‌త ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. కేవ‌లం రూ.5 కే టిఫిన్ , భోజ‌నం వంటివాటిని ఈ క్యాంటీన్ల ద్వారాఅందించారు. దీంతో పేద‌లు.. కార్మికులు.. ఎక్కువ‌గా వీటికి అల‌వాటు ప‌డ్డారు. అయితే.. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని ఎత్తేసింది. మ‌రోవైపు.. అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు కూడా పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలోపేద‌ల‌కు ఇబ్బందిగానే ఉంది. దీనిని గ‌మ‌నించిన టీడీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది.

పేద‌ల‌కు చేరువ‌య్యేందుకు.. పోయిన ఓటు బ్యాంకును స‌మీక‌రించేందుకు దీనికి మించిన మార్గం లేద‌ని భావించిన టీడీపీ.. అన్నాక్యాంటీన్ల‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి ఎన్నారైల నుంచి కూడా సాయం అందే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఎన్నారై.. టీడీపీ స‌మ‌న్వ‌య క‌ర్త‌.. కోమ‌టి జ‌యరాం.. ప‌దిజిల్లాల్లో ఏర్పాటు చేసే అన్నాక్యాంటీన్ల‌కు త‌మ వంతు సాయం అందిస్తామ‌న్నారు. దీనిని బ‌ట్టి నిధుల‌కు లోటు లేదు. ఈ నేప‌థ్యంలో మిగిలిన జిల్లాల్లోనూ నిధులు స‌మీక‌రించి.. వీటిని ఏర్పా టు చేసి.. పేద‌ల‌కు మ‌రింత చేరువ కావాల‌ని నిర్ణ‌యించింది. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on July 2, 2022 8:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

50 minutes ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

55 minutes ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

2 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

2 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

4 hours ago

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

6 hours ago