Political News

అటు రేవంత్‌.. ఇటు సంజ‌య్‌.. ఎవ‌రిది పైచేయి..!

చేరిక‌ల విష‌యంలో జాతీయ‌ పార్టీలు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పోటాపోటీగా వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఏడాది త‌ర్వాత వ‌ల‌స‌ల గేట్లు ఎత్తారు. దీంతో ఒకేసారి ప్ర‌వాహంలా ముంచెత్తుతోంది. బండి సంజ‌య్ ఈట‌ల‌తో మొద‌లుపెట్టి సంచ‌ల‌నం సృష్టించారు. కానీ త‌ర్వాత చేరిక‌లు నెమ్మ‌దించాయి. ఇపుడు ఆయా పార్టీల కీల‌క నేత‌ల‌కు గాలం వేసి మోదీ స‌మ‌క్షంలో చేర్పించి త‌న బ‌లం నిరూపించుకోవాల‌ని బండి భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప‌గ్గాలు అందుకునే సమయంలో పార్టీ ప‌రిస్థితి ఏమంత బాగాలేదు. ఒక‌వైపు పార్టీని టీఆర్ఎస్ నీడ క‌మ్మేయ‌డం.. మ‌రోవైపు బండి సంజ‌య్ రూపంలో బీజేపీ గాలి బ‌లంగా వీస్తుండ‌డంతో మొద‌ట్లో త‌ట్టుకోవ‌డం కొంత క‌ష్ట‌మైంది. పైగా పార్టీలో సీనియ‌ర్లు ఎవరూ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో వారి అస‌మ్మ‌తిని చ‌ల్లార్చ‌డానికే పుణ్య‌కాలం కాస్తా గ‌డిచింది. ఈలోగా బీజేపీ కాంగ్రెస్ స్థానాన్ని ఆక్ర‌మించుకోవ‌డం మొద‌లు పెట్టింది.

దుబ్బాక ఉప ఎన్నిక‌, గ్రేట‌ర్ ఫ‌లితాలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌తో జైత్ర‌యాత్ర సాగిస్తూ వ‌స్తోంది. బీజేపీని నిలువ‌రించి.. టీఆర్ఎస్ ను ఎదుర్కునేందుకు రేవంత్ తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు. సొంత పార్టీలోనే అస‌మ్మ‌తిని త‌ట్టుకుంటూ పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా పార్టీలో చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఇత‌ర పార్టీల్లో ఉన్న అసంతృప్తుల‌ను గుర్తిస్తూ మూడో కంటికి తెలియ‌కుండానే పని కానిచ్చేస్తున్నారు.

తొలుత ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు దంప‌తుల‌ను చేర్చుకున్నారు. త‌ర్వాత ఆలేరు నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కురాలు బండ్రు శోభారాణి రేవంత్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో కాంగ్రెస్ లో చేరారు. ఆ త‌ర్వాత పీజేఆర్ కుమార్తె విజ‌యా రెడ్డిని స్వాగ‌తించారు. మ‌రుస‌టి రోజే ఖ‌మ్మం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంక‌టేశ్వ‌ర్లు చేరారు. ఆ మ‌రుస‌టి రోజే మాజీ మంత్రి బోడ జ‌నార్ద‌న్ కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. వీరంతా టీఆర్ఎస్‌, బీజేపీల్లో కీల‌కంగా ఉన్న‌వారే. ఇలా కాంగ్రెస్ లోకి చేరిక‌లు సునామీలా ముంచెత్తాయి.

ఇపుడు ఆ ప‌నిని బండి సంజ‌య్ మొదలు పెట్టారు. ఈటెల రాజేంద‌ర్‌, కూన శ్రీ‌శైలం గౌడ్ వంటి ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌ల చేరిక‌ల‌తోనే బీజేపీ ఆగిపోయింది. ఇపుడు ఆ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల నేప‌థ్యంలో తిరిగి చేరిక‌ల‌పై దృష్టి పెట్టారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ల‌లోని కీల‌క నేత‌ల‌పై క‌న్నేశారు.

తొలుత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని చేర్చుకోవాల‌ని భావిస్తున్నారు. ఆ త‌ర్వాత కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి.. టీఆర్ఎస్ లోని మాజీ మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, విద్యార్థి నేత పిడ‌మ‌ర్తి ర‌వి త‌దిత‌ర నేత‌ల‌ను మోదీ స‌మ‌క్షంలో భారీ బ‌హిరంగ స‌భ‌లో బీజేపీలో చేర్పించేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇలా రేవంత్, బండి సంజ‌య్ పోటాపోటీగా దూసుకెళుతున్నారు. చూడాలి మ‌రి ఎవ‌రిది పైచేయి అవుతుందో..!

Satya

Recent Posts

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

2 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

2 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

4 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

4 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

5 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

5 hours ago