మూలిగే నక్కమీద తాడిపండు పడిన చందంగా మారిపోయింది ఏపీ ఉద్యోగుల పరిస్థితి. పీఆర్సీ సరిగా లేదని.. గత 2019 ఎన్నికల్లో ఇచ్చిన సీపీఎస్ పింఛన్ రద్దు హామీని నెరవేర్చడం లేదని.. తాము భవిష్యత్తు అవసరాల కోసం.. దాచుకున్న జీపీఎఫ్ నిధులను రూ.800 కోట్లను కూడా సర్కారు సొంతానికి వాడేసుకుందని లబోదిబోమంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పై సర్కారు మరో పిడుగు వేసింది. వారి పై కొరడా ఝళిపించింది. తక్షణం వెళ్లిపోవాలి.. అంటూ.. ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఇకపై వారంలో 5 రోజులు పనిచేయాలని కూడా చెప్పడానికి రెడీ అయింది. దీంతో ఉద్యోగుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలోకి పడినట్టు అయిందనే వాదన వినిపిస్తోంది.
హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించి.. సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటిలోగా ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసి.. మంచి స్థితిలో అప్పగించాలని(ఏమైనా రిపేర్లు ఉంటే ఉద్యోగ కుటుంబాలే చేయించాలి) జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(జీడీఏ) ఆదేశించింది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యత అని ఉత్తర్వుల్లో పేర్కొంది. చేయించకపోతే.. జీతాల నుంచి రికవరీ చేస్తామని తెలిపింది.
మరోవైపు.. అత్యంత కీలకమైన సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులకు కొనసాగుతున్న వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం.. ఈ నెల 27 తేదీతో ముగిసింది. మరి, ఇకమీదట ఎలాంటి విధానం కొనసాగనుంది అనే విషయంలో క్లారిటీ లేదు. గడువు ముగిసి రెండు రోజులైనా.. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో.. ఐదు రోజుల పనిదినాల విధానం కొనసాగుతుందా? లేదా? అనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.
జూలై రెండో తేదీ శనివారం అవుతోంది. ఐదు రోజుల విధానం కొనసాగితే.. ఆ రోజు ఉద్యోగులకు సెలవు లభిస్తుంది. కానీ.. ఇప్పటి వరకూ సర్కారు స్పష్టత ఇవ్వకపోవడంతో.. ఆ రోజున విధులకు రావాలా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నారు సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులు. మరో రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. దీంతో ఉద్యోగులు లబోదిబో మంటున్నారు.
This post was last modified on June 29, 2022 9:16 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…