మూలిగే నక్కమీద తాడిపండు పడిన చందంగా మారిపోయింది ఏపీ ఉద్యోగుల పరిస్థితి. పీఆర్సీ సరిగా లేదని.. గత 2019 ఎన్నికల్లో ఇచ్చిన సీపీఎస్ పింఛన్ రద్దు హామీని నెరవేర్చడం లేదని.. తాము భవిష్యత్తు అవసరాల కోసం.. దాచుకున్న జీపీఎఫ్ నిధులను రూ.800 కోట్లను కూడా సర్కారు సొంతానికి వాడేసుకుందని లబోదిబోమంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పై సర్కారు మరో పిడుగు వేసింది. వారి పై కొరడా ఝళిపించింది. తక్షణం వెళ్లిపోవాలి.. అంటూ.. ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఇకపై వారంలో 5 రోజులు పనిచేయాలని కూడా చెప్పడానికి రెడీ అయింది. దీంతో ఉద్యోగుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలోకి పడినట్టు అయిందనే వాదన వినిపిస్తోంది.
హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించి.. సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటిలోగా ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసి.. మంచి స్థితిలో అప్పగించాలని(ఏమైనా రిపేర్లు ఉంటే ఉద్యోగ కుటుంబాలే చేయించాలి) జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(జీడీఏ) ఆదేశించింది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యత అని ఉత్తర్వుల్లో పేర్కొంది. చేయించకపోతే.. జీతాల నుంచి రికవరీ చేస్తామని తెలిపింది.
మరోవైపు.. అత్యంత కీలకమైన సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులకు కొనసాగుతున్న వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం.. ఈ నెల 27 తేదీతో ముగిసింది. మరి, ఇకమీదట ఎలాంటి విధానం కొనసాగనుంది అనే విషయంలో క్లారిటీ లేదు. గడువు ముగిసి రెండు రోజులైనా.. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో.. ఐదు రోజుల పనిదినాల విధానం కొనసాగుతుందా? లేదా? అనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.
జూలై రెండో తేదీ శనివారం అవుతోంది. ఐదు రోజుల విధానం కొనసాగితే.. ఆ రోజు ఉద్యోగులకు సెలవు లభిస్తుంది. కానీ.. ఇప్పటి వరకూ సర్కారు స్పష్టత ఇవ్వకపోవడంతో.. ఆ రోజున విధులకు రావాలా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నారు సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులు. మరో రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. దీంతో ఉద్యోగులు లబోదిబో మంటున్నారు.
This post was last modified on June 29, 2022 9:16 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…