Political News

సీఎం జ‌గ‌న్‌కు పేరొస్తోంది.. మాకు రావ‌ట్లేదు.. : వైసీపీలో కొత్త ర‌గ‌డ‌

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొత్త ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌-ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేలు.. నేత‌లు.. అంటే అంతా ఒకే కుటుంబం అని అంద‌రూ అనుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్ కూడా అలానే భావిస్తున్నారు. ఇది మ‌న ప్ర‌భుత్వం అనే మాటే ఆయ‌న నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇప్పుడు కొత్త వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. “ముఖ్య మంత్రికే పేరు వ‌స్తోంది.. మాకు మాత్రం రావ‌డం లేదు” అని సాక్షాత్తూ.. వైసీపీ ఎమ్మెల్యే బ‌హిరంగ వేదిక‌పైనే వ్యాఖ్యానించ‌డం.. సంచ‌లనంగా మారింది.

ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. సీఎం వేరు.. తాము వేరు.. అని ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అదేస‌మయంలో సీఎం జ‌గ‌న్ చేస్తున్న కార్య‌క్ర‌మాల‌తో ఏక వ్య‌క్తి పార్టీగా వైసీపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తోందా? అనే సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు.. జిల్లాస్థాయిలో మినీ ప్లీన‌రీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లా నిర్వ‌హించిన జిల్లా స్తాయి ప్లీన‌రీకి .. ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ అధినేత‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“సీఎం జ‌గ‌న్‌.. న‌వ‌రత్న ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. దీంతో ఎవ‌రికి పేరు వ‌స్తోంది. ఆయ‌న‌కు మాత్ర‌మే పేరు వ‌స్తోంది. ప్ర‌జ‌ల్లో ఆయ‌న పేరుమాత్ర‌మే వినిపిస్తోంది. మ‌మ్మ‌ల్ని(ఎమ్మెల్యే) ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మాకు కూడా పేరు రావాలి క‌దా! మేం కూడా క‌ష్ట‌ప‌డుతున్నాం క‌దా! కానీ.. మ‌మ్మ‌ల్ని ప్ర‌జ‌లు పూచిక పుల్ల‌ల్లా తీసిపారేస్తున్నారు. కూర‌లో క‌రివేపాకు నాయ‌కులు మాదిరిగా త‌యార‌య్యాం” అని నిట్టూర్చారు.

అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితిని కూడా మ‌ద్దిశెట్టి చెప్పుకొచ్చారు. ద‌ర్శిలో రూ.100 కోట్ల‌తో ప‌నిచేయించిన‌ట్టు చెప్పారు. అయితే.. ఈ నిధుల ఖ‌ర్చుకు సంబంధించి.. ప్ర‌భుత్వం నుంచి రూపాయి కూడా విడుద‌ల కాలేద‌న్నారు. ఇంకా మ‌రిన్ని ప‌నులు చేయించాల్సి ఉంద‌ని.. నిధులు రాక‌పోతే.. ఎలా చేయించాల‌ని ఆయ‌న నిల‌దీశారు. “రోడ్లు, డ్రైనేజీ ప‌నులు చేయించాల్సి ఉంది. ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్ని నిల‌దీస్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి వెళ్తే.. వారు నిల‌దీస్తున్నారు. మ‌రి ఏం చేయాలి? ఎమ్మెల్యేల‌కు అంతో ఇంతో పేరు రావాలంటే.. క‌నీసం రోడ్ల‌యినా వేయించాలి క‌దా!” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ముఖ్యంగా వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిగా మారాయి. దీనిపై అధిష్టానం ఏమంటుందో చూడాలి.

This post was last modified on June 29, 2022 9:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

11 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

12 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

15 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

15 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

16 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

16 hours ago