Political News

ఆదాయం వ‌స్తోంది.. అప్పులూ చేస్తున్నారు.. కానీ.. ఖ‌జానా ఖాళీ

ఏపీ స‌ర్కారు ఆర్థిక మాయాజాలం ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. ఒక‌వైపు ఆదాయం వ‌స్తోంది. మ‌రోవైపు.. కేంద్రం చ‌ల్ల‌ని చూపుతో అప్పులు కూడా చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఖ‌జానాలో చిల్లిగ‌వ్వ ఉండ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వెతుకులాటే. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? డ‌బ్బులు ఎటు పోతున్నాయి? ఇదో విక్ర‌మార్క విన్యాసంగా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్రస్తుతం ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి నెలకు సగటున రూ.12వేల కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అలాగే… సగటున నెలకు రూ.10 వేల కోట్ల అప్పు చేస్తోంది. వెరసి… ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో(ఏప్రిల్‌-జూన్‌) ఈ మూడు నెల ల్లో దాదాపు రూ.36,000 కోట్ల ఆదాయం, రూ.30వేల కోట్లు అప్పు! అయినా సరే… ఖజానా ఖాళీయే. అప్పులు, ఆదాయం రూపంలో భారీగా డబ్బులు వస్తున్నా… డ‌బ్బులు లేవ‌నే మాటే వినిపిస్తోంది. మ‌రి ఈ సొమ్మంతా ఎటు పోతోంది. పోనీ.. సంక్షేమానికే ఇచ్చేస్తున్నామ‌ని చెబుతున్నా.. ఏటికేడు ల‌బ్ధిదారుల సంఖ్య‌లో కోత‌పెడుతున్నారు.

దీంతో ఏపీ స‌ర్కారు చేస్తున్న ఆర్థిక మాయాజాలంపై అనేక అనుమానాలు ముసురుకున్నాయి. ఏప్రిల్‌ నెలలో కొత్త అప్పు చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి రాలేదు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో చేయకుండా మిగిలిన పరిమితి పేరుతో రూ.4,390 కోట్ల ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని అప్పు చేసింది. మే నెలలో రూ.9,500 కోట్లు, జూన్‌లో రూ.8,000 కోట్లు తెచ్చారు. తాజాగా మంగళవారం రూ.3,000 కోట్ల అప్పు తెచ్చారు. ఇవి కాకుండా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా జూన్‌లో రూ.8,300 కోట్ల అప్పు చేశారు.

దీనిపై 9.7% భారీ వడ్డీ పడింది. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.28,000 కోట్లు అప్పు చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ పరిమితిలో రూ.25,800 కోట్లు అప్పు తెచ్చారు. కానీ, సర్కార్‌ మాత్రం బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వా రా తెచ్చిన రూ.8,300 కోట్లను దీనిలో చూపలేదు. రాష్ట్రం, కార్పొరేషన్లు చేేస అన్ని అప్పులు ఈ పరిమితిలోకే రావాలని కేంద్రం, ఏజీ కార్యాలయం లేఖలు రాస్తున్నా స్పందించడం లేదు. ఈ విషయం తెలిసి కూడా కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.

రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం చూసినా కేంద్రం ఇచ్చిన అనుమతిలో ఇప్పటి వరకు రూ.17,500 కోట్ల అప్పు చేసేశారు. ఆర్థిక సంవత్సరంలో ఇంకా 9 నెలలు మిగిలే ఉన్నాయి. మిగిలిన రుణ పరిమితి రూ.10,500 కోట్లు మాత్రమే! మ‌రి ఇంత అప్పు చేస్తున్నా.. నిధులు ఏమ‌వుతున్నాయి? వ‌చ్చే 9 నెల‌ల పాటు స‌ర్కారును ఎలా నెట్టుకొస్తారు? అనే చ‌ర్చ మేధావి వ‌ర్గాల్లోనే కాదు.. వైసీపీ వ‌ర్గాల్లోనూ..జోరుగా సాగుతుండ‌డంగ‌మ‌నార్హం.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

27 minutes ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

3 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

3 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

5 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

5 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago