Political News

ఇదేంది థాక్రేకి మరో గట్టి దెబ్బ ?

మహారాష్ట్రలో సంకీర్ణప్రభుత్వ సంక్షోభం నానాటికీ పెద్దదయిపోతోంది. ఇప్పటికే మంత్రి ఏక్ నాధ్ షిండే నాయకత్వంలో మంత్రులు, ఎంఎల్ఏలు అంతా కలిపి సుమారు 40 మంది తిరుగుబాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏల సంఖ్య ఎంతన్నది కచ్చితంగా తెలియకపోయినా షిండే వర్గానిదే మెజారిటి అని తెలుస్తోంది. తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలను ఎలా దారికితెచ్చుకోవాలో అర్ధంకాక సీఎం థాక్రే బుర్రగోక్కుకుంటున్నాడు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎంపీల్లో కూడా తిరుగుబాటు మొదలైనట్లు వార్తలు మొదలయ్యాయి. శివసేనకు 19 మంది ఎంపీలున్నారు. వీరిలో ఏకంగా 14 మంది థాక్రేపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. వీరంతా ఇప్పుడు షిండేతో టచ్ లో ఉన్నారట. అంతకుముందు నుండే బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. సో జరుగుతున్నది చూస్తుంటే థాక్రేకి ముందు ముందు చాలా పెద్ద సమస్య తప్పేట్లులేదు.

నిజానికి ఇప్పటికిప్పుడు ఎంపీల్లో చీలిక తీసుకురావాల్సిన అవసరం బీజేపీకి లేదు. అయినా ఎందుకిలా ప్రయత్నిస్తోంది ? ఎందుకంటే తనను వదిలేసి ఎన్సీపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపినప్పటినుండి శివసేనంటే బీజేపీ మండిపోతోంది. సంవత్సరాల తరబడి తనతో ఎంతో నమ్మకంగా ఉన్న శివసేన హఠాత్తుగా చెయ్యిచ్చి పై రెండుపార్టీలతో చేతులు కలపటాన్ని బీజేపీ తీరని అవమానంగా భావిస్తోంది. అవకాశం వచ్చినపుడు అంతకంత దెబ్బతీయాలని ఎదురు చూస్తున్నది.

అయితే బీజేపీ ఎదురుచూసిన అవకాశం రెండేళ్ళయినా రాలేదు. సంకీర్ణప్రభుత్వం హ్యాపీగా గడచిపోతోంది. మరో రెండేళ్ళల్లో షెడ్యూల్ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. కొడితే ఇప్పుడే శివసేనను దెబ్బకొట్టాలని కమలంపార్టీ నేతలు అనుకున్నారు. అందుకనే థాక్రేపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న షిండేని బాగా కెలికేసింది. బీజేపీ వలలో షిండే కూడా పడిపోయారు. వెంటనే పాచికలు వేసి షిండేని రెచ్చగొట్టింది. దాంతో రెచ్చిపోయిన షిండే పెద్దసంఖ్యలోనే ఎంఎల్ఏలను రెచ్చగొట్టి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఎంఎల్ఏల తిరుగుబాటుతోనే కిందా మీదా అవుతున్న థాక్రే ఎంపీలు కూడా తిరగబడితే అంతే సంగతులు.

This post was last modified on June 29, 2022 12:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీతా 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

15 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

50 minutes ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

1 hour ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

2 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago