Political News

అమ‌రావ‌తి భూములు ఎక‌రం 10 కోట్లు.. జ‌గ‌న్ వ్యూహం ఏంటి?

ఏపీ క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ ఏం చేస్తున్నారు. ఆయ‌న ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు..? ఇదీ..ఇప్ప‌డు జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. తాను ప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్ల‌న‌ట్టుగా.. ఏపీలో మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసి తీరుతామ‌ని.. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని.. ప‌దే ప‌దే చెప్పారు. ఈ విష‌యంలో ఏకంగా.. శాస‌న మండ‌లిని ర‌ద్దు చేసేందుకు కూడా వెనుకంజ వేయ‌లేదు. రాత్రికి రాత్రి.. మండ‌లి ర‌ద్దుకు నిర్ణ‌యం తీసుకున్నారు కూడా!

అయితే.. ఈ క్ర‌మంలో రైతులు చేసిన ఆందోళ‌న‌.. హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల‌తో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేర‌కు అమ‌రావ‌తిలో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల్సి వ‌చ్చింది. అయితే.. దీనికి సంబంధించి.. నిధులు కేటాయించాల్సిన ప్ర‌భుత్వం అప్పులు చేసుకోవాల‌ని.. రాజ‌ధాని ప్రాంత అభివృద్ది అథారిటీ(సీఆర్ డీఏ)ను ఆదేశించింది. దీంతో ఇక్క‌డ కొన్ని సంస్థ‌ల‌కు కేటాయించిన భూముల‌ను వెన‌క్కి తీసుకుని.. వాటిని విక్ర‌మ‌యించాల‌ని సీఆర్ డీఏ నిర్ణ‌యించింది.

ఈ క్రమంలో స‌ర్కారు.. వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లింది. ఇక్క‌డి ఎక‌రా భూమికి 10 కోట్ల రూపాయ‌లు ధర నిర్ణ‌యించింది. వాస్త‌వానికి ఇప్పుడు అంత ధ‌ర పెట్టి..ఇక్క‌డ భూములు కొనుగోలు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రారు. ఎందుకంటే.. మ‌ళ్లీ వ‌చ్చే ప్ర‌భుత్వాన్ని బ‌ట్టే ఎవ‌రైనా.. ఇక్క‌డ నిర్ణ‌యం తీసుకుంటారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని మ‌న‌స్పూర్తిగా అభివృద్ధి చేస్తార‌ని.. ఎవ‌రూ భావించ‌డం లేదు. దీంతో ఇప్పుడు అంత ధ‌ర‌పోసి కొన్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. వెన‌క్కి త‌గ్గుతారు.

ఇదే జ‌రిగితే.. ‘చంద్ర‌బాబు ఎంపిక రాంగ్‌’ అనే ప్రచారం చేసేందుకు.. జ‌గ‌న్ టీం రెడీ అవుతుంది. “అది శ్మ‌శాన‌మ‌ని ముందే చెప్పాం. ఇప్పుడు ఎవ‌రూ కొనేందుకు కూడా ముందుకురావ‌డం లేదు. రాష్ట్రంలో ఓమూల‌కు ఉన్న ప్రాంతం కాబ‌ట్టి.. ఒక్క‌రు కూడా కొన‌డం లేదు. చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఫెయిల్‌. అందుకే మేం మూడు రాజ‌ధానులు ప్ర‌క‌టిస్తున్నాం” అని పాజిటివ్ యాంగిల్‌లో త‌మ‌కు, నెగిటివ్ యాంగిల్‌లో విప‌క్షంపైనా విరుచుకుప‌డేందుకు వైసీపీకి ఒక ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు అవుతుంది.

అలా కాకుండా..ఒక‌వేళ‌.. ఎవ‌రైనా ఇక్క‌డి భూముల‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌స్తే.. “ఇది మా ఘ‌న‌త‌. మేం అన్నీ ఆచితూచే ధ‌ర‌లు నిర్ణ‌యించాం. జ‌గ‌న్‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే కొన్నారు” అని ఇప్పుడు కూడా ప్ర‌చారం చేసుకునేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలిసింది. అంతేకాదు.. రాజ‌ధానిని తాము అభివృద్ది చేయ‌మ‌ని చెప్ప‌లేదు క‌దా.. ఇక్క‌డ ‘శాస‌న రాజ‌ధాని’ ఉంటుంద‌ని చెప్పాం క‌దా.. అందుకే.. కొన్నారు అని ప్ర‌చారం చేసుకునే ప్లాన్ కూడా రెడీగా ఉంద‌ని అంటున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఈ అప్పులు చేయ‌డం ద్వారా.. ప్ర‌భుత్వంపై రాజ‌ధాని మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన క‌నీస మొత్తం రూ.5000 కోట్ల భారం త‌ప్పిపోతుంది. పైగా.. అప్పులు చేసుకునేందుకు బ్యాంకు ల‌కు కూడా ప్ర‌భుత్వం ఎలాంటి హామీ ఉండ‌డం లేదు. దీంతో ఏదైనా ఉంటే.. సీఆర్డీఏనే భ‌రించాలి. అంటే.. మొత్తానికి రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ ఆది నుంచి చెబుతున్న వాద‌ననే లోపాయికారీగా వైసీపీ స‌ర్కారు అమ‌లు చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 29, 2022 12:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

40 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago